అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న .
    
      గుంటూరు , 08 మే 2025 (ప్రజా అమరావతి):  పెదకాకాని మండలంలోని సిబార్ దంత వైద్య కళాశాలలో                    “ వరల్డ్ తలసేమియా డే ” ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ప్రారంభించారు.  సిబార్ దంత వైద్య కళాశాల డీన్                    డా. క్రిష్ణ ప్రసాద్ , అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డా. క్రిష్ణ మోహన్ ,   ప్రొ. డా.రేవతి  తొలుత జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కి సిబార్ దంత వైద్య కళాశాలలోని పలు విభాగాలను చూపించి ప్రజలకు తక్కువ వైద్య ఖర్చులతో అందిస్తున్న దంత సంబంధమైన   వైద్య విధానాన్ని , అత్యాధునిక ల్యాబ్ పరికరాలను వివరించారు.  అలాగే ప్రపంచ తలసేమియా డే ను పురస్కరించుకుని కళాశాలలోని వంద మంది విద్యార్ధిని , విద్యార్దులు మరియు కళాశాల అధ్యాపకులు ఈ రోజు తలసేమియా రోగులకు  రక్తాన్ని డొనేట్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న


అన్నారు.  అతి అరుదైన ప్రాణాంతక తలసేమియా రోగగ్రస్తులకు రక్తదానం చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.  ఇందుకు కాలేజీ విద్యార్ధిని , విద్యార్దులు మరియు అధ్యాపకులు రక్తదానానికి  ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. సిబార్ దంత వైద్య  కళాశాల ఏర్పాటు చేసిన ఈ  రక్తదాన శిబిరంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.  ఉన్నతమైన ఆశయంతో రక్తదానాన్ని ఇవ్వడానికి  ముందుకు వచ్చిన కళాశాల విద్యార్ధిని , విద్యార్దులకు మరియు అధ్యాపకులను అభినందిస్తున్నానన్నారు.  ఇలాంటి ఉన్నతమైన కార్యానికి రక్తదానాన్ని అందించడం వల్ల అత్యంత సంతృప్తి పొందినవారం అవుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పధకం క్రింద తలసేమియా రోగులకు ప్రతి నెల పది వేల రూపాయల పెన్షన్   అందించడం జరుగుతున్నదని తెలిపారు.  అలాగే ఎన్ జి ఓ లు కూడా తలసేమియా రోగులకు అనేక విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. ప్రపంచ  స్థాయి అత్యాధునిక మౌళిక సదుపాయాలు  కల్గిన ఈ దంత వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్దిని , విద్యార్దులు మరింతగా రాణించి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలషించారు.  సమాజానికి సేవలు అందించడం అనేది అత్యుత్తమైన అలవాటు  అని , ఈ అంశాన్ని విద్యార్దులు ఆచరించేందుకు కృషి చేయాలని విద్యార్దులకు జిల్లా కలెక్టర్ హితబోధ చేశారు.  అనంతరం రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్                       ఎస్. నాగలక్ష్మీ ప్రారంభించి రక్తాన్ని అందిస్తున్న విద్యార్ధిని , విద్యార్దులకు పండ్లను పంపిణీ చేశారు.  అనంతరం రక్తదానాన్ని అందిస్తున్న విద్యార్ధిని , విద్యార్దులకు ఫ్యాకల్టీ అధ్యాపకులకు  ప్రశంసా పత్రాలను అందించారు. 
  ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ డియం అండ్ హెచ్ ఓ డా. శ్రావణ బాబు, పెదకాకాని తహశీల్దార్ కృష్ణకాంత్ , సిబార్ దంత వైద్య కళాశాల విద్యార్ధిని , విద్యార్దులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
Comments