గుంటూరు 07 మే 2025 (ప్రజా అమరావతి): గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అభివృద్ధి కోసం సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
తెలియజేస్తున్నానని కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని కంటి విభాగంకు హెచ్ డి ఎఫ్ సి , జింకానా సంయుక్తంగా అందించిన రూ. 85 లక్షల విలువైన కంటి వైద్య పరికరాలను ప్రారంభించే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, రాష్ట్ర మాదిగ వెల్ఫేర్, కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి , గుంటూరు తూర్పు శాసన సభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ , ప్రత్తిపాడు శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు , జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.రమణ యశశ్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జీజీహెచ్ అభివృద్ధి కోసం సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అత్యాధునిక మైన కంటి వైద్య పరికరాల కొనుగోలుకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రూ. 65 లక్షలు, జింకానా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ త్రిపురనేని రవికుమార్ రూ. 20 లక్షలు అందించడం జరిగిందన్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కేవలం బ్యాంకింగ్ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని వెల్లడించారు. అందుకే జీజీహెచ్ లో పరికరాల కొనుగోలుకు కోసం రూ. 65 లక్షలు అందించారన్నారు. ప్రభుత్వం జీజీహెచ్ అభివృద్ధికి కట్టుబడి వుందని స్పష్టం చేసారు.
కార్యక్రమం అనంతరం రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ గారి స్పూర్తితో జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద వడ్రాణం హరిబాబు నాయుడు మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ టీడీపి రాష్ట్ర కార్యదర్శి ఏర్పాటు చేసిన మజ్జిగ , మినరల్ వాటర్ , అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జియంసి డిప్యూటీ మేయర్ సజీలా , డాక్టర్ త్రిపురనేని రవికుమార్, గాదె వెంకటేశ్వరరావు, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment