షైన్ ఆనంద శరణాలయంకు జేడబ్ల్యూసీఎస్ & డబ్ల్యూఎస్సీ గుర్తింపు...
*షైన్ ఆనంద శరణాలయంకు జేడబ్ల్యూసీఎస్ & డబ్ల్యూఎస్సీ గుర్తింపు...*
 . 

గుంటూరు (ప్రజా అమరావతి);

       చినకాకానిలో షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న షైన్ ఆనంద శరణాలయంకు బాల్య సంక్షేమ దిద్దుబాటు సేవలు అండ్ వీధి బాలల సంక్షేమ శాఖ గుర్తింపు పత్రం అందజేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ గుర్తింపు పత్రం అందుకున్నారు. జిల్లాలో 22 సేవా సంస్థలకు గుర్తింపు పత్రాలను అందజేశారు. వాటిలో చినకాకాని షైన్ ఆనంద శరణాలయం కూడా గుర్తింపు పత్రం అందుకుంది. ఈ కార్యక్రమంలో డీపీఓ సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ మాట్లాడుతూ శరణాలయంలో 50 మంది బాలురకు, 30 మంది బాలికలకు అనుమతిస్తూ ప్రభుత్వం గుర్తింపు పత్రం అందజేసింది. బాల బాలికలకు భవిష్యత్తులో కూడా శరణాలయంలో మంచి విశిష్టమైన సేవలు అందిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ఫౌండేషన్ లక్ష్యమన్నారు.

Comments