అమరావతిలో ప్రత్యేక పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ క్యాంప్
అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం (ఆర్ పి ఓ) ప్రత్యేక పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని పౌరులకు పాస్పోర్ట్ సేవలను మెరుగైన రీతిలో అందించడంలో ఈ మొబైల్ వ్యాన్ సేవ ఒక ముఖ్యమైన అడుగు.
ఈ నెల 22 మరియు 23 ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎపిసిఆర్డిఎ) వారి తుల్లూరు కార్యాలయంలో మొబైల్ వాన్ యొక్క మొదటి డ్రైవ్ అమరావతిలో జరుగుతోంది. పాస్పోర్ట్ సేవల లభ్యత, సామర్థ్యం మరియు వినియోగదారు- స్నేహపూర్వకతను పెంపొందించడం, వాటిని ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ క్యాంప్ లక్ష్యం.
ఈ క్యాంప్ పాస్పోర్ట్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క
నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. రాబోయే వారాల్లో, ఈ వ్యాన్ చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి, మంగళగిరి మరియు మచిలీపట్నం వంటి ముఖ్యమైన ప్రదేశాలను పర్యటించనుంది అని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివ హర్ష అన్నారు.
addComments
Post a Comment