కోటబొమ్మాళి (ప్రజా అమరావతి);
* రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నేత*
*ఆయనపై నమ్మకంతోనే రాష్ట్రంలో రూ. 10 లక్షల కోట్లు పెట్టు బడులు వచ్చాయి*
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
*పేద వర్గాలను ఆదుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యం*
*పాలన బాగుందంటూ జనం కితాబు
*
*నాలుగో రోజు ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు*
*ఎలా ఉన్నారు.. పింఛన్ పెంచి ఇస్తున్నాం కదా. సంతృప్తిగా ఉందా..?*
*ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్న అచ్చెన్న*
*వ ర్షం పడుతున్నా తొలి అడుగులో అడుగేసిన జనం*
*తల్లికివందనం మీకు అందిందా. ఎంత మంది పిల్లలున్నా ఇచ్చిన మాటకు నిలబడి మీ ఖాతాల్లో జమ చేశాం. మీరు పిల్లలు సంతోషంగా ఉన్నారా..?*
*ఊళ్లోకి రావాలంటే గతంలో రోడ్డంతా గోతులే. ప్రస్తుతం ఆపరిస్ధిలేదు కదా, ధాన్యం డబ్బులు ఇంతకు ముందు నెలలు తరబడి పెండింగ్. ఇప్పుడా పరిస్థితి లేదుగా..?*
.*వచ్చే నెలలో 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.....ప్రారంభం*
తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సంద ర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట శనివారం శ్రీకాకళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలుగుదేశం శ్రేణులు ఊరూ, వాడా ఇంటి ముంగిట వాలారు. ఏడాది పొడవునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏం అవస రాలున్నాయని ఆరా తీశారు. అవి కూడా చేస్తామంటూ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
*మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ఘనస్వాగతం కలికిన నేతలు*
టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం చిన్నబమ్మిడి తెలుగు దేశం నాయకులు ,స్థానికులు ఘనస్వాగతం పలికారు. మంత్రితో సహా మిగతా నేతలు తరలిరావడమే కాకుండా పేదల ఇళ్లకు వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంచి ఇవ్వడం సంతోషం గా ఉందని, మందులు ఇతరత్రా ఖర్చులకు ఇప్పుడు పరాయి వాళ్లను చేయిచాచి అడగాల్సిన పనిలేదని పలువురు వృద్దుల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలను ఒక్కొక్క టిగా తొలగిస్తూ మీరు మెచ్చే విధంగా పాలన చేస్తున్నామా? లేదా అంటూ స్థానికుల నుంచి గౌరవ మంత్రి వర్యులు మంత్రి సమాధానాలు రాబ ట్టారు. ప్రభుత్వపరంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదవర్గాల కోసం ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, ఇవికాక రాబోయే నెలరోజుల్లో మరిన్ని పథకాలు మీకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వర్యలుతో పాటు నేతలు తమ ఇళ్లకు వచ్చి ఆప్యాయంగా పలకరించడం సంతృప్తికరంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏడాదిలో మార్పు చూపించారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం. పింఛన్ దగ్గర నుంచి తల్లికి వంద నం వరకు అంతా బాగుంది.. . బస్సులో కూడా ఉచిత ప్రయాణం అంటున్నారు.. ఇంతకంటే సంతోషం ఏమీ ఉంటుంది అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో నేతలు ఉబ్బి తబ్బిబయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నేత అని పేద వర్గాలను ఆదుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ ఏడాదిలో ప్రజలకు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనతో తొలి అడుగు పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
*వ ర్షం పడుతున్నా తొలి అడుగులో అడుగేసిన జనం*
కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మడి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ అయ్యారు.వర్షం పడుతున్నా తొలి అడుగులో అడుగేసిన జనం...కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందుతున్న ప్రజలు గౌరమ మంత్రి వర్యులకు ప్రజలు అడు గడుగున నీరాజనం పడుతున్నారు. కార్యక్రమంలో తెలుగు దేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విర్తస్తూ..*
గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ... వారి పాలనలో రాష్ట్రం లక్షల కోట్లు అప్పులు పాలైందని ప్రజలకు విరించిన మంత్ర వర్యులు..ప్రజల ఆకాంక్షలకు కూటమి ప్రభుత్వం పట్టం కడుతుందని తెలిపారు. ఏడాది పాలనతో ఇచ్చిన హామీలు అమలు చేశామని.
ఏడాదిలొ చేసిన అభివృద్ధి వైకాపా నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆర్ధిక నేరగాళ్లు రాష్ట్రంలో ఉండకూడదని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అన్నివిధాలంగా నష్టం కలిగించారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. భావితరాల భవిష్యత్త్ కోసం నిరంతం శ్రమించే నాయకులు ముంఖ్య మంత్రి చంద్రబాబునాయుడు గారని అన్నారు.
addComments
Post a Comment