- క్వింటాకు రూ.1,490 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మద్ధతు ధరను చెల్లించనున్నాయి
- నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు
- ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి
- సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి అచ్చెన్నాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన మామిడి రైతులు
అమరావతి (ప్రజా అమరావతి);
తోతాపూరి మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దిగుబడి ఎక్కువ ఉండటంతో మామిడి పంటను పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాలని, 4 రూ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. కేజీ 12 రూ చొప్పున రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢీల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మం త్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సబ్సీడి నగదులో 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
*మామిడి రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు*
మంత్రి అచ్చెన్నాయుడు అభ్యర్ధనని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్రకటించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మద్ధతు ధరను చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ విషయం పట్ల తోతాపూరి మామిడి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడు కి, మంత్రి అచ్చెన్నాయుడు కి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
*హర్షం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు*
తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతుల నష్టం రాకూడదని ముందుగానే గ్రహించి కేజీ మామిడిని 12 రూ లకు కొనుగొలు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ మామిడికి 4 రూ సబ్సిడీ ని అందచేశామని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబునాయుడు , కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
addComments
Post a Comment