*భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ లో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేట లో పరామర్శించారు.* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట కు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ బాబు చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ బాబు భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతి లను ఓదార్చారు. సంతోష్ బాబు పిల్లలు, అభిజ్ఞ, అనిరుధ్ తేజ లతో మాట్లాడారు. దేశ రక్షణ కోసం సంతోష్ బాబు ప్రాణ త్యాగం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. సంతోష్ బాబు మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి ని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ బాబు భార్య సంతోషీ కి గ్రూప్ ఒన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్య కు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్య కు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు


Comments