అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త వినిపించింది తెలంగాణ హైకోర్టు. అగ్రిగోల్డ్‌లో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీ డిపాజి టర్లకు ఏపీ ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. వార్డు సచివాల యం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌ దారు ల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలి పింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తా రని, జిల్లా న్యాసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ దరఖాస్తులు ధ్రువీకరిస్తారని న్యాయస్థానానికి తెలిపింది. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌పైనా న్యాయస్థానం విచారణ చేపట్టింది. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


Comments