వైయస్సార్‌ ఆసరా, చేయూత, జగనన్నతోడు, వలంటీర్లకు సత్కారం, ఉపాధిహామీ అంశాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.



అమరావతి (ప్రజా అమరావతి):

వైయస్సార్‌ ఆసరా, చేయూత, జగనన్నతోడు, వలంటీర్లకు సత్కారం, ఉపాధిహామీ అంశాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.


క్యాంపు కార్యాలయంలో సమగ్రంగా సమీక్షించిన సీఎం.


*వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత లబ్ధిదారులైన మహిళలు ఎంపికచేసుకున్న జీవనోపాధి కార్యక్రమాల అమలుపై సీఎం సమీక్ష*

ఆసరా, చేయూతల కింద 66,702 రిటైల్‌ దుకాణాలు పెట్టుకునేందుకు ఆప్షన్‌

ఇప్పటికే 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు

చేయూత, ఆసరా కింద వ్యాపారాలు నడుపుకుంటున్న వారికి ఏదైనా సమస్య వచ్చిన పక్షంలో వెంటనే తీర్చడానికి రిటైల్‌ కాల్‌ సెంటర్‌ కూడా పెట్టామన్న అధికారులు

రిటైల్‌ దుకాణాలు కాకుండా చిరువ్యాపారాలు, టెక్స్‌టైల్స్, హాండీక్రాఫ్ట్స్, ఫుడ్‌ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్‌ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారు దాదాపు 16.25 లక్షల మంది ఉన్నారని తెలిపిన అధికారులు

వీరికి కూడా వారి వారి వ్యాపారాలను చేసుకోవడం ద్వారా స్థిర ఉపాధికి ప్రణాళిక వేసినట్టు వెల్లడించిన అధికారులు

ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉపాధిమార్గాలను కల్పిస్తామన్న అధికారులు

వీలైనంత త్వరగా వీరికీ తోడుగా నిలవాలని అధికారులకు సీఎం ఆదేశం

బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు కదలాలని సీఎం ఆదేశం

చేయూత, ఆసరా కింద ఆప్షన్లు ఎంచుకున్న వారికి ఉపాధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూసేందుకే ఒక ఏజెన్సీని నియమించాలని సీఎం ఆదేశం


*జగనన్న జీవక్రాంతిపై సీఎం సమీక్ష*

డిసెంబర్‌ 2021 నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు అందజేత

ప్రతినెలా 5వేల మందికి మేకలు, గొర్రెలు అందజేత


*జగనన్న పాలవెల్లువపై సీఎం సమీక్ష*

డిసెంబరు 2021 నాటికి మరో 1,06,376 యూనిట్లు అందజేస్తామన్న అధికారులు

రెండో విడత ఆసరా,  చేయూత అందించేలోగా ఈ ఉపాధిమార్గాలను ముమ్మరంగా చేపట్టాలని సీఎం ఆదేశాలు 

గడువుకన్నా ముందుగానే వారికి గొర్రెలు, మేకలు, పాడిపశువులు అందించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం


*జగనన్న తోడుపైనా సీఎం సమీక్ష*

జగనన్న తోడు కింద పెండింగులో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరయ్యేలా చూడాలని బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా మిగిలిన వారికి కూడా రుణాలు  మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్న బ్యాంకర్లు

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ పథకాల అమలు విషయంలో ఏపీ చాలా ముందుకు దూసుకుపోతుందన్న బ్యాంకర్లు


*వలంటీర్లకు సత్కారంపై సమీక్ష*

వలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

అర్హతలు ప్రకారం మూడు కేటగిరీలకు వాలంటీర్ల ఎంపిక

లెవల్‌ 1 లో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్ల పరిశీలన,  

లెవల్‌ 2లో ప్రతి మండలంలో, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున....

లెవల్‌ 3లో ప్రతి నియోజకవర్గంలో 5గురు చొప్పున వలంటీర్లకు సత్కారాలు

ఏడాదిపైగా సేవలు అందించిన వారికి సేవామిత్రతో పాటు బ్యాడ్జీ, రూ.10వేలు

లెవల్‌ –2 వారికి సేవా రత్నతో పాటు, స్పెషల్‌ బ్యాడ్జ్,  రూ.20వేలు

లెవల్‌ –3 వారికి  సేవా వజ్రాల పేరిట స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటు మెడల్, రూ.30వేల చొప్పున నగదు పురస్కారాలు

పురస్కారాల ఎంపికకు అర్హతలను నిర్దేశించిన అధికారులు

సచ్ఛీలత, మూడురోజుల్లోగా పెన్షన్లు పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్‌ –19 సర్వే తదితర అంశాలను పురస్కారాల ఎంపికకు ప్రామాణికంగా తీసుకున్న అధికారులు

ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల కార్యక్రమాలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి

పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవాదృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమమన్న సీఎం


*ఉపాధి హామీ కార్యక్రమంపై సీఎం రివ్యూ*

ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తర్వాత 2020–21లో అత్యధిక పనిదినాలు చేశామన్న అధికారులు

2328 లక్షల పనిదినాలు చేశామన్న  అధికారులు

జూన్‌లో అత్యధికంగా 798 లక్షల పనిదినాలు  చేశామన్న అధికారులు


*గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కుల నిర్మాణాలపైనా సీఎం సమీక్ష*

ఈ పనులు వేగంగా ముందుకు సాగేలా చూడాలని సీఎం ఆదేశాలు



సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పశుసంవర్థకశాఖ స్పెషల్ సిఎస్  పూనం మాలకొండయ్య, గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, గ్రామ,వార్డు సచివాలయాలు, వాలంటీర్ల విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా,  సెర్ప్ సిఇఓ రాజబాబు, ఇతర ఉన్నతాధికారులు.

Comments