గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష.



అమరావతి (ప్రజా అమరావతి):


గృహనిర్మాణం,  గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష.



*గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డుల ప్రధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.*


*వలంటీర్లకు పురస్కారాలు*


వలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది సందర్భంగా వారిని సత్కరించే కార్యక్రమాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వలంటీర్లకు సత్కారం

ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన 2,18,115 మంది వలంటీర్లకు ‘‘సేవా మిత్ర’’ 


4వేల మంది వలంటీర్లకు ‘‘సేవా రత్న’’

ప్రతి మండలానికి 5 గురు చొప్పున ఎంపిక

ప్రతి మున్సిపాల్టీకి 5 గురు చొప్పున ఎంపిక

ప్రతి కార్పొరేషన్‌ నుంచి 10 మంది ఎంపిక

ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుల తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక


నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ‘‘సేవా వజ్రాలు’’గా ఎంపిక

875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం


ప్రోత్సాహకంగా సేవామిత్రలకు రూ.10వేల నగదు, 

సేవా రత్నాలకు రూ. 20వేల నగదు 

సేవా వజ్రాలకు రూ.30వేల నగదు 

వలంటీర్లకు ఇవ్వనున్న మెడల్, ప్రశంసాపత్రం, బ్యాడ్జీలను పరిశీలించిన ‌సీఎం


*గృహనిర్మాణంపై సీఎం సమీక్ష:*

తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్‌ ఎంచుకున్న వారికి నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని సీఎం ఆదేశం

స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం 

కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

ఇళ్లు కట్టుకోవడానికి కరెంటు, నీళ్ళు లాంటి సదుపాయాలు లేవనే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని సీఎం ఆదేశం

కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దు అధికారులతో సీఎం

ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు స్పష్టంగా చెప్పిన సీఎం

జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలని సీఎం ఆదేశం

జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సమగ్రంగా సమీక్ష చేసిన సీఎం

ఈమేరకు తయారు చేసిన డిజైన్లను పరిశీలించి సూచనలు చేసిన సీఎం


సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఎపిఎస్‌హెచ్‌డిసిఎల్‌ ఎండి నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు.

Comments