వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్ఫ్రా) పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి (ప్రజా అమరావతి):
హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్ఫ్రాలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:
నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులు అందరికీ కూడా డ్రిప్, స్పింక్లర్ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం
దీనివల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్,స్ప్రింక్లర్ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుంది : సీఎం
చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మసేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి : సీఎం
ఏంచేసినా శాచ్యురేషన్ పద్ధతిలో ఉండాలన్న సీఎం
కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ అందాలన్న సీఎం
వ్యవస్ధలో అవినీతి ఉండకూడదు : సీఎం
చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలి : సీఎం
రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచన
దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలన్న ముఖ్యమంత్రి
సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్టెండరింగ్ ద్వారా కొనుగోలు చేయడంద్వారా రేటు తగ్గుతుందని, దీనివల్ల ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందన్న సీఎం
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుందన్న సీఎం
*సెరికల్చర్పై ప్రత్యేక దృష్టి*
ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రెతులకు ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్న సీఎం
వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలి : సీఎం
*అగ్రి ఇన్ఫ్రాపై సీఎం సమీక్ష*
అగ్రి ఇన్ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్సస్ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం సమీక్ష
దాదాపు 14 రకాల సదుపాయాలు
డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్ యూనిట్లు తదితర సదుపాయాలు
దాదాపు వీటికోసం రూ.14,562 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశం
దీనికి సంబంధించి పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)లో ఉంచాలని సీఎం ఆదేశం
ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛెర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు.
addComments
Post a Comment