అనంతపురం (ప్రజా అమరావతి) :
పి.యం. కిసాన్ (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి)2021 - 22 పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ తో మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ..
మహిళా రైతు వన్నూరమ్మను, అనంతపురం జిల్లాను ప్రశంసించిన భారతదేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు..
దేశం మొత్తంలో 5,6 మందితో మాట్లాడితే అందులో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మను ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి కార్యాలయం..
ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం ఆదర్శం.. వన్నూరమ్మ లాంటి మహిళా రైతులు దేశానికి ఆదర్శం అని అనంతపురం జిల్లాను, వన్నూరమ్మ ను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు.
ఒంటరి దళిత మహిళ ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నికరం నాలుగు రెట్లు ఆదాయం సంపాదిస్తోంది...
అందరూ ఇలాంటి పద్ధతులనే అనుసరిస్తే రాష్ట్రం, దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని సూచించిన ప్రధాన మంత్రి.
అనంతరం ప్రధాన మంత్రి గారితో మాట్లాడిన మహిళా రైతు వన్నూరమ్మను అభినందించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.
addComments
Post a Comment