శ్రీవారికి అభిషేకానంతరం స్పెషల్ స్టోరి.
తిరుమల (ప్రజా అమరావతి); శ్రీవారి స్వామివారి నొసటన ఉండే నామాలను 'తిరుమణికాప్పు' (ఊర్థ్వపుండ్రాలు)
అంటారు.
వారంలో లో ఒకసారి అంటే శుక్రవారం నాడు అభిషేకానంతరం శ్రీవారి నొసటన ఈ తిరుమణికాప్పు సమర్పిస్తారు.
దీనికి 16 తులాల పచ్చ కర్పూరం,
1.5 తులాల కస్తూరి వినియోగిస్తారు.
కన్నులు పూర్తిగా కప్పబడినట్లుగా అలంకరించే ఈ తిరునామాలు మరలా గురువారం వరకు యథావిధిగా ఉండి, గురువారం నాటి నేత్ర దర్శనం సందర్భంగా సడలించబడతాయి.
బ్రహ్మోత్సవాల ఆ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణ రెట్టింపుగా ఉంటుంది.
ప్రతి ఏటా 10 రోజుల
(తొమ్మిది రోజులుగా వ్యవహారం) పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే శుక్రవారం నాడు - మధ్యలో వచ్చే శుక్రవారం నాడు - ముగింపు తర్వాత వచ్చే శుక్రవారం నాడు -
ఇలా 3 లేదా 4 శుక్రవారాల్లో స్వామివారి నామాల అలంకరణ రెట్టింపుగా ఉంటుంది.
ఇందుకుగాను ...
◆ 32 తులాల పచ్చకర్పూరం,
◆ 3 తులాల కస్తూరి వినియోగించబడుతుంది.
అందువల్లే బ్రహ్మోత్సవ సమయాల్లో వచ్చే 3 లేదా 4 శుక్రవారాలను 'రెట్టింపు శుక్రవారాలు' అని తిరుమల ఆలయ సాంప్రదాయంలో ప్రతీతి.
ఈ పచ్చకర్పూర నామం తిరుమల ఆలయంలో అనుసరించే వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం అలంకరిస్తారు.
స్వామి వారి కృప మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటూ...
addComments
Post a Comment