శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్  కుటుంబసభ్యులతో కలసి శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనుటకు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ  మరియు పాలకమండలి సభ్యులు శ్రీ డి.వి.ఆర్.కె.ప్రసాద్  స్వాగతం పలికారు.  మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్  కుటుంబముతో కలసి శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ  మరియు పాలకమండలి సభ్యులు శ్రీ డి. వి.ఆర్.కె.ప్రసాద్  శ్రీఅమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను మంత్రివర్యులుకు అందజేసినారు.

Comments