శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ ఎం.శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్ రావు) శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. గౌరవ మంత్రివర్యులుకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి. భ్రమరాంబ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు దేవస్థానం నందు ఆషాఢమాసము సందర్భంగా జరుగుచున్న శ్రీ అమ్మవారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమమును గురించి మంత్రివర్యులుకు తెలియజేశారు.
addComments
Post a Comment