శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి.వాణి మోహన్, IAS , శ్రీ అమ్మవారి ఆలయము నకు విచ్చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వారు శ్రీ అమ్మవారి ఆలయం నుండి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు వెళ్ళు మార్గములో ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి దశావతార రూపాలను, భక్తుల సౌకర్యార్థం దేవస్తానం నందు చేసిన పలు ఏర్పాట్లను, దేవస్థానం నందు జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
addComments
Post a Comment