డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);
డిజిపి గౌతం సవాంగ్ ను కలిసిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి వి సింధు.
టోక్యో ఒలింపిక్స్లో సాధించిన కాంస్య పతకాన్ని తిలకించి అభినందించిన డిజిపి.మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయి లో పతకం సాదించడం ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన గౌరవం.ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి.రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని ఆకాంక్షించిన డిజిపి.
పివి.సింధు, తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన డిజిపి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు.ఎపి ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడిన పి వి.సింధు.
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరిన పి వి.సింధు.
addComments
Post a Comment