శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): వంశీ హాస్పిటల్, తిరుమలగిరి, సికింద్రాబాద్ కి చెందిన శ్రీ ఎస్.చలపతిరావు గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి అలాంకారం నిమిత్తం 20.9 గ్రాములు బరువు గల బంగారు లక్ష్మీ కాసుల హారమును ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారిని కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment