- సచివాలయంలో ఎపిఎండిసి పై సమీక్షా సమావేశం
- ఎపిఎండిసి కార్యకలాపాలను సమీక్షించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి షమీమ్ అస్లాం
- సమీక్షలో పాల్గొన్న గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, సంస్థ సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్
అమరావతి (ప్రజా అమరావతి): వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ చైర్ పర్సన్ శ్రీమతి షమీమ్ అస్లాం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గనుల శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, సంస్థ సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసిని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
. సంస్థకు మరింత తోడ్పాటును అందించేందుకు ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్న చైర్ పర్సన్ ను ప్రభుత్వం నియమించిందని, శ్రీమతి షమీమ్ అస్లాం అటు ప్రభుత్వంకు, ఇటు సంస్థకు మధ్య వారధిగా నిలుస్తారని అన్నారు.
ఈ సందర్భంగా ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి వివిధ విభాగాల వారీగా సంస్థ పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో తన కార్యక్రమాలను విస్తరిస్తోంది ఆయన తెలిపారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఖనిజ వెలికితీతకు ఏపీఎండీసీ శ్రీకారం చుట్టిందని అన్నారు. సులియారీ కోల్ మైన్స్ లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బ్రహ్మదియా కోల్ మైన్ లో కూడా పనులు ప్రారంభించేందుకు రంగం సిద్దమైందని అన్నారు. అంతే కాకుండా బైరటీస్ ఖనిజ వెలికితీత కార్యక్రమాల ద్వారా ఎపిఎండిసి అంతర్జాతీయ మార్కెట్లో కీలక స్థానంలో నిలుస్తోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో గ్రానైట్, బీచ్ శాండ్, సిలికాశాండ్, కాల్సైట్, బాల్ క్లే వంటి ఖనిజ వనరులను కూడా వెలికి తీయడం ద్వారా సంస్థ తన సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందని తెలిపారు. మైనింగ్ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కింద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కడపజిల్లా మంగంపేటలోని బెరైటీస్ మైనింగ్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎపిఎండిసి పౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందించడం, ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. దీంతోపాటు మంగంపేట కేంద్రంగా కేంద్రంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చిందని అన్నారు. అలాగే కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించేందుకు 72 హ్యాబిటేషన్ లలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తోందని తెలిపారు. మైనింగ్ కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ప్రభుత్వ తోడ్పాటుతో భవిష్యత్తులో ఏపీఎండీసీ మరిన్ని రాష్ట్రాల్లో ఖనిజ వెలికితీత కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు.
addComments
Post a Comment