శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): హైదరాబాద్ కు చెందిన శ్రీ డి.ప్రణీత్ మరియు పవిత్ర దంపతులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,00,000/-లు చెక్కు రూపములో ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, ప్రధానార్చకులు శ్రీ మల్లేశ్వర శాస్త్రి గారు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment