పూర్ణాహుతి కార్యకమము తో ముగిసిన వినాయక చవితి ఉత్సవములు :
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
ది.10.09.2021 నుండి ది.12.09.2021 వరకు నిర్వహించుచున్న వినాయక చవితి ఉత్సవములలో భాగంగా
ఈరోజు(ది.12.09.2021)
- ఉ.08-00 గం.లకు ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో మండప పూజ, గణపతి హోమము నిర్వహించిన ఆలయ అర్చకులు..
- ఉ.10-00 గం.లకు పూర్ణాహుతి సమర్పించడం తో దేవస్థానం నందు ముగిసిన ఉత్సవములు..
- పాల్గొన్న ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది..
- సా.05-00 గం.లకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమం.
addComments
Post a Comment