అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)*
*క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహా యజ్ఞం*
*4,097 చెత్త సేకరణ వాహనాలను నేడే (02.10.2021, శనివారం) విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*కార్యక్రమ లక్ష్యం*
మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వినూత్న విధానాలను అమలుచేయడం ద్వారా సురక్షితమైన మరియు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలను అందించడం...క్లీన్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయడం
దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశుధ్య నిర్వహణ దశలను మొదటి నుండి చివరి వరకు (ఎండ్ టూ ఎండ్ సొల్యూషన్) సంపూర్ణ పరిష్కారంగా చేపట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
1. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్బిన్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్బిన్ల పంపిణీ
2. ప్రతి ఇంటి నుండి తడి చెత్తను, పొడి చెత్తను, ప్రమాదకర వ్యర్ధాలను సేకరించి 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించుట
3. 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు వాహనాల (480 కాంపాక్టర్ వెహికిల్స్) ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ల వద్దకు చేర్చుట
4. 72 ఐఎస్డబ్యూఎం నందు తడిచెత్తనుంచి కంపోస్ట్ ఎరువు లేక బయోగ్యాస్ తయారీ, పొడిచెత్త నుండి హానికారక వ్యర్ధాలను నిర్మూలించుట, తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకొని వచ్చుట
5. కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్ల కొనుగోలు
6. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలను బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా అభివృద్ది పరచుట, గ్రామాలు మరియు నగరాలను పరిశుభ్రంగా మార్చుట
7. స్వచ్చ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన గ్రామాలు, నగరాలను మెరుగైన ఫలితాలను సాధించుట
*కార్యాచరణ*
*గ్రామ పంచాయతీలలో*
23,000 మంది గ్రీన్ అంబాసిడర్ ల ద్వారా చెత్త సేకరణ, రవాణా, శుద్దీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రత
కొత్తగా 4,171 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం
గ్రామ పంచాయతీలకు 14,000 ట్రైసైకిల్స్ పంపిణీ
పదివేలు పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాలలో చెత్త సేకరణ, రవాణా మరింత మెరుగుకు 1,000 ఆటో టిప్పర్ల పంపిణీ
మాస్కులు, శానిటరీ ప్యాడ్లు వంటి వ్యర్ధాల ద్వారా వ్యాధులు ప్రబలకుండా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించి భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాల పంపిణీ
దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ
135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్ధాల నిర్వహణ
10.645 గ్రామ పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్ కాని వ్యర్ధాలను దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలింపు
ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని, ప్రజల్లో జవాబుదారీతనం కూడా పెరగాలని నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు యూజర్ చార్జీలు
*మున్సిపాలిటీలలో*
అన్ని మున్సిపాలిటీల పరిధిలో, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
చెత్తను వేరు చేసేందుకు వీలుగా మున్సిపాలిటీల పరిధిలో కోటీ ఇరవై లక్షల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్త బుట్టల పంపిణీ
చెత్త సేకరణ మరియు రవాణా చేయుటకు 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ
124 మున్సిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఏర్పాటు
ఆరువేల కాంపాక్టర్ బిన్లకు టెండర్లు
72 మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ల వ్యవస్ధాపనకు ఏజెన్సీల ఖరారుకు టెండర్లు
లక్ష పై చిలుకు జనాభా కలిగిన 32 మున్సిపాలిటీలలోని డంప్ సైట్లలో వ్యర్ధాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని సదరు మున్సిపాలిటీలకు ఆదేశాలు
రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్లనుండి సేకరించిన వ్యర్ధాలను శుద్ది చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు
ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని, ప్రజల్లో జవాబుదారీతనం కూడా పెరగాలని నిర్వహణ ఖర్చులకు మాత్రమే పట్టణాల్లో వాటి స్ధాయిని బట్టి ఇంటికి రోజుకు కేవలం రూ.1 నుండి రూ.4 వరకు యూజర్ చార్జీలు
addComments
Post a Comment