నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పికె మిశ్రా ప్రమాణ స్వీకారం.
విజయవాడ,12 అక్టోబరు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.13వ తేది బుధవారం మధ్యాహ్నం 1గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ జస్టిస్ పికె మిశ్రా తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు,న్యాయ మూర్తులు,తదితరులు పాల్గోనున్నారు.
addComments
Post a Comment