భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి కి ఘన స్వాగతం .
రేణిగుంట, అక్టోబర్ 14 (ప్రజా అమరావతి): రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్.వి. రమణ గారికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నకు చేరుకున్న గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి
ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు గౌ.ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, గౌ.భారత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమ కోహిల్, భారత సుప్రీంకోర్టు సిపిఎస్ రిజిస్టర్ శ్రీ శ్రీధర్ రావు, గౌ. హైకోర్ట్ జడ్జిలు శ్రీ జస్టిస్ .ఎం. సత్యనారాయణ మూర్తి,జస్టిస్ లలిత కనికంటి, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ కె.బానుమతి,
హైకోర్ట్ రిజిస్ట్రార్ ఎ.గిరిధర్, చిత్తూరు జిల్లా జడ్జి వై వి ఎస్ డి జి.పార్థ సారథి,జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, డి.ఐ.జి. క్రాంతి రతన్ టాటా, ఎస్.పీ లు చిత్తూరు , తిరుపతి(అర్బన్), సెంథిల్ కుమార్, వెంకట అప్పల నాయుడు, ఎ.ఎస్.పి సుప్రజ, ఆర్డీఓ తిరుపతి కనకనరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేశ్, చిత్తూరు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ దినకర్, రేణిగుంట తహశీల్దార్ శివ ప్రసాద్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
addComments
Post a Comment