అమరావతి (ప్రజా అమరావతి);
*ఐ.టీ శాఖ బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి: ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
*
క్రిస్ మస్ కల్లా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల పైలట్ ప్రాజెక్టు పూర్తికి మంత్రి మేకపాటి ఆదేశం
"వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల" ఏర్పాటులో పురోగతిపై ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి సమీక్ష
మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్లను ఏర్పాటు చేయబోయే ప్రాంతాలలో స్థానిక అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాలలో ప్రారంభించే దిశగా ఐ.టీ శాఖ కసరత్తు
డిసెంబర్ 24 కల్లా స్పష్టమైన నివేదికతో పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశం
వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్ సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం
త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐ.టీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానన్న మంత్రి మేకపాటి
ఐ.టీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ కూడా అవసరం
ఐ.టీ బ్రాండింగ్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐ.టీ అధికారులకు ఆదేశం
సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్ పై మరింత ఫోకస్ చేయాలి
పైలట్ ప్రాజెక్టులో కీలకమైన విద్యుత్, ఇంటర్నెట్ ఇబ్బందులను మంత్రికి తెలిపిన ఐ.టీ శాఖ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి
కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎంబీపీఎస్ మరీ తక్కువ ఉందని మంత్రికి తెలిపిన ఐ.టీ ఉన్నతాధికారులు
ఐ.టీ బ్రాండింగ్ స్ట్రాటజీ ఆవశ్యకత ఎంతో ఉంది
వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లకు మౌలిక వసతులలో భాగంగా విద్యుత్ అంతరాయం గురించి ప్రస్తావించిన సలహాదారు శ్రీనాథ్ రెడ్డి
బొగ్గు సమస్య, విద్యుత్ ఇబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు
విద్యుత్ అంతరాయం తాత్కాలిక సమస్య
బొగ్గు గనులలో నిక్షేపాల కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, చర్యలు చేపడతాం
29 ప్రాంతాలలో అవసరమైన బ్యాండ్ విడ్త్ సదుపాయాన్ని సత్వరమే కల్పించాలని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డికి మంత్రి ఆదేశం
నవంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఐ.టీ శాఖ సన్నద్ధం
హాజరైన ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు
addComments
Post a Comment