గురువారం నాడు ఎంపిటిసి స్థానాలకు 5, గ్రామ వార్డులకి రెండు నామినేషన్ దాఖలు



కొవ్వూరు   (ప్రజా అమరావతి);  


గురువారం నాడు ఎంపిటిసి స్థానాలకు 5, గ్రామ వార్డులకి రెండు నామినేషన్ దాఖలు



కొవ్వూరు డివిజన్ పరిధిలో ఈరోజు మొత్తం ఏడు నామినేషన్లు అభ్యర్థులు వెయ్యడం  జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. 


ఈరోజు వేసిన  నామినేషన్లు వివరాలు: 


కొవ్వూరు డివిజన్ లోని  ఏడు ఎంపిటిసి స్థానాలకు గాను ఐదు నామినేషన్ లు, ఐదు  పంచాయతీ  వార్డు లకు గాను రెండు నామినేషన్ ను అభ్యర్థులు వెయ్యడం జరిగిందన్నారు. 


కొవ్వూరు పురపాలక సంఘం 23 వ వార్డు కి ఎవ్వరూ గురువారం నామినేషన్లు వెయ్యలేదన్నారు.


ఎంపీటీసీ స్థానాలకు గురువారం దాఖలైన నామినేషన్లు () లో వేసిన నామినేషన్ లు

 అత్తిలి మండలంలో ఈడూరు ( లేవు ); పాలూరు  (రెండు), చాగల్లు లో చాగల్లు-5  (లేవు), ఇరగవరం లో కె. కుముదవల్లి (లేవు), పెరవలి లో కానూరు-2 (లేవు); నిడదవోలు లో తాళ్లపాలెం (ఒకటి);  తాళ్లపూడి లో వేగేశ్వరపురం-2 (రెండు) చొప్పున నామినేషన్ లు వెయ్యడం జరిగిందన్నారు.


గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికల్లో భాగంగా 


  కొవ్వూరు డివిజన్ పరిధిలో 5 పంచాయతీ వార్డుల కిగాను   కొవ్వూరు  మండలం కాపవరం  గ్రామంలో 3వ వార్డుకి ఒకరు, పెరవలి మండలం అన్నవరప్పాడు 12 వ వార్డుకి ఒకరు  ఈరోజు నామినేషన్ వెయ్యడం జరిగిందని తెలిపారు.   శుక్రవారం  నామినేషన్ లు స్వీకరించడానికి చివరి తేదీ అన్నారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 11 , గ్రామ పంచాయతీ వార్డు లకి మూడు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.


Comments