భువనేశ్వర్ (ప్రజా అమరావతి):
– దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముందడుగు
– రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీ
– ఉభయ రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడి
– చర్చల తర్వాత సంయుక్త ప్రకటన చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ నవీన్ పట్నాయక్, శ్రీ వైయస్.జగన్
– ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన శ్రీ వైయస్.జగన్
– అక్కడ నుంచి విశాఖకు, విశాఖనుంచి భువనేశ్వర్ చేరుకున్న ఏపీ సీఎం.
– విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్ గెస్ట్ హౌస్కు చేరుకున్న ముఖ్యమంత్రి.
– స్టేట్గెస్ట్ హౌస్లో సీఎంకు స్వాగతం పలికిన ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు.
– ఆతర్వాత ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మరో దఫా స్వల్ప సమావేశం.
– అక్కడ నుంచి నేరుగా ఒడిశా సచివాలయం లోక్సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న ఏపీ సీఎం.
– వైయస్.జగన్కు సాదరస్వాగతం పలికిన ఒడిశా సీఎం.
– తర్వాత కన్వెన్షన్ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం.
– తర్వాత కాన్ఫరెన్స్హాల్లో రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్ష.
– ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీలతో జాయంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
– సమస్యల పరిష్కారంపై ఈకమిటీ దృష్టిపెడుతుందని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.
– కొఠియా గ్రామాల సమస్య,
నేరడి బ్యారేజీ,
జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టులో మిగిలిపోయిన భాగం పూర్తి లాంటి మూడు ప్రధాన అంశాలతో పాటు వివిధ అంశాలమీద చర్చ జరిగినట్టుగా వెల్లడి.
– పోలవరం కారణంగా పాక్షికంగా ముంపునకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై సూచనలు చేసిన ఏపీ సీఎం
– బలిమెల, అప్పర్ సీలేరులో విద్యుత్ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ఓసీ అంశాలు
– బహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురంకు నీటి విడుదలపైనా చర్చలు
– ఈ అంశాలపై దృషిసారించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి జాయింట్కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ఒడిశా సీఎం శ్రీ నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం శ్రీ వైయస్.జగన్
– రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటవుతుందని వెల్లడి
– దీనికి సంబంధించి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదల చేసిన రెండు రాష్ట్రాలు
– మావోయిస్టు కార్యకలాపాల నియంత్ర, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించాలని, కలికట్టుగా ఎదుర్కోవాలని ప్రకటనలో పేర్కొన్న ఇరు రాష్ట్రాలు.
– సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షలు నిర్వహణను సోదరభావం పెంపొందించేందుకు చేపట్టాలని నిర్ణయం.
– ఈదిశగా అడుగులు వేయడానికి శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...
– సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలు ఉన్నాయి. తొలిసారిగా ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకేశాం.
– ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరం.
– చీఫ్సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుంది. వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటుంది.
– చర్చలు జరపడమే కాదు, జాయింట్ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారికి, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు ధన్యవాదాలు.
– కలికట్టుగా, సహకార ధోరణితో వీటిని పరిష్కరించుకుంటాం.
– రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయం.
addComments
Post a Comment