భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఘనస్వాగతం
పుట్టపర్తి, నవంబర్21(ప్రజా అమరావతి): జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పుట్టపర్తి అతిథి గృహమునందు ఘన స్వాగతం లభించింది. భారత దేశ ప్రధాన న్యాయమూర్తి బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి ఆయనతోపాటు కర్ణాటక రాష్ట్ర హైకోర్టుప్రధాన న్యాయమూర్తి RITU RAJ AWASTHI , భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సతీమణి శ్రీమతి నూతలపాడు శివమాల కుటుంబ సభ్యులు. ఆదివారం సాయంత్రం 7.45 సమయంలో పుట్టపర్తి ప్రశాంతి సాయి నిలయం లో సాయి శ్రీనివాస అతిథి గృహం నందు చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ నిశాంత్ కుమార్, సిరి, ప్రశాంతి, ట్రైనింగ్ కలెక్టర్ సూర్య తేజ, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి,
అనంతపురంఫస్ట్ సివిల్ జడ్జి రమేష్, ధర్మవరం కోర్టుజడ్జి శివ జ్యోతి, పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, సత్య సాయి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సంజీవ్, రిజిస్టార్ సాయి గిరిధర్, సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి, డాక్టర్ మోహన్, నాగానంద, పాండే, కదిరి ఆర్డిఓ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాత్రిఅతిథి గృహంలో బస చేసి రేపటి రోజు ఉదయం వేళలో పుట్టపర్తి నందుపలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
addComments
Post a Comment