ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
కుంచనపల్లి (ప్రజా అమరావతి);.
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 13 నుంచి 20 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం మూడు రోజులపాటు (నవంబర్ 26-28) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలియజేసారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అడ్వైజర్ (ఎన్డీఎంఏ) కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలుగా పర్యటించనున్నారు.
శుక్రవారం 26-11-2021
బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది.
శనివారం 27-11-2021
చిత్తూరు జిల్లాలో ఒక బృందం , వైయస్ఆర్ కడప జిల్లాలో ఒక బృందం పర్యటించనుంది.
ఆదివారం 28-11-2021
నెల్లూరు జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి.
సోమవారం ఉదయం కేంద్రబృందం గౌరవ ముఖ్యమంత్రి గారితో సమావేశం కానున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ తేలియజేసారు.
addComments
Post a Comment