జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు

 



గుంటూరు (ప్రజా అమరావతి);

నూతనంగా నియమితులైన గుంటూరు జిల్లా సర్పంచ్ ల సంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపూడి పాపారావు  ఆధ్వర్యంలో .... ఈ రోజు  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని


మర్యాద పూర్వకంగా వారి కార్యాలయంలో కలసి 14&15 వ ఆర్థిక సంఘం నిధుల సమస్యల పరిష్కారం మరియు గౌరవ వేతన విషయమై ... పలు సర్పంచుల సమస్యలపై చర్చించి వినతి పత్రాన్ని సమర్పించారు.


 చైర్ పర్సన్ క్రిస్టినా  మాట్లాడుతూ.... చెప్పిన ప్రతి సమస్యలపట్ల పరిశీలన చేసి,   పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి గారి దృష్టికి మరియు సంబంధిత శాఖ కమిషనర్ గారికి మరియు ఉన్నత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తాను అని మాట ఇచ్చారు.


వారితో పాటుగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ చైర్మన్ మరియు అఖిల భారతి పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి (ఢిల్లీ) డాక్టర్ జాస్తి  వీరాంజినేయులు , గుంటూరు జిల్లా సర్పంచ్ సంఘ సభ్యులు N.ఉషారాణి K. రమాదేవి, P. నాగమణి, M. శ్రీకాంత్, చందు వెంకట సాంబశివరావు, పి. ఆచారి, అబ్దుల్ రషీద్  ఇతర సర్పంచులు పాల్గొన్నారు.

Comments