కొవ్వూరు (ప్రజా అమరావతి);
లోకసంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి
అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, డా. తానేటి వనిత అన్నారు.
గురువారం సుబ్రహ్మణ్యషష్ఠి సందర్బంగా కొవ్వూరు సుబ్రహ్మణ్య స్వామిగుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈ. ఓ, పురోహితులు పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటామని అన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కీ అన్ని దేవాలయము లలో విశేష పూజలను అందు కొంటారన్నారు. కొవ్వూరు సుబ్రహ్మణ్య స్వామీ గుడిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలుగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు అందరికి దర్శనం సులభము అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వల్లీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామీ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని ఆమె ఆకాక్షించారు.
మంత్రి వెంట కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, మునిసిపల్ వైస్ ఛైర్పర్శన్ లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవి, స్థానిక నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్. భాస్కర రావు, తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment