గుంటూరు (ప్రజా అమరావతి);
గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన జగనన్న తోడు మూడవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగు నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, మద్దాలి గిరిధర్, జడ్పీ ఛైర్మన్ హెనీ క్రిస్టినా, కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్ కుమార్, కార్పొరేటర్లు, జడ్పీటీసీ లు, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైనప్పటికి వివిధ కారణాల వలన సంక్షేమ పథకాలు అందని వారికి నగదు పంపిణీ చేయడం జరిగింది.
*మేకతోటి సుచరిత - రాష్ట్ర హోంశాఖ మాత్యురాలు...*
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని శాటురేషన్ పద్దతిలో గుర్తించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది ఈ రోజు వివిధ పథకాల ద్వారా లబ్ది పొందడం జరిగింది.
దాదాపు 702 కోట్ల రూపాయలను అర్హులైన వారికి సీఎం గారి చేతుల మీదుగా అందించడం జరుగుతోంది.
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ 5 కోట్ల 35 లక్షలు, ఆసరా 30 లక్షలు, చేయూత 33 కోట్ల 26 లక్షలు, నేతన్న నేస్తం 5లక్షలు, కాపు నేస్తం కింద 3 కోట్ల 52 లక్షల నగదును లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది.
అర్హత ఉంది ఇళ్ల పట్టాలు పొందని వారిని కూడా గుర్తించి ఈ రోజు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాము.
అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదనే సదుద్దేశంతో సీఎం గారు ఈ కార్యకమాన్ని చేపట్టారు.
లబ్ధిదారులందరి తరుపున సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
*వన్ టైం సెటిల్మెంట్ పై టీడీపీ కావాలనే దుష్ప్రచారం* చేస్తోంది
.
వాలంటరీలు బలవంతంగా వసూలు చేస్తున్నారని విషప్రచారాన్ని ప్రసారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా బలవంత వసూలు లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు.
మన రాష్ట్రంలో దాదాపు 1983 లో కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు రాని వారిని 48 లక్షల మందిని గుర్తించాము.
అలాంటి వారందరికీ ఓటిఎస్ ద్వారా పట్టాలు పొందడం ఒక వరం లాంటిదని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
రుణం లేని వారికి కేవలం 10 రూపాయలకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సౌకర్యాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు.
రుణం ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో వారికి 15 వేలు, కార్పోరేషన్ పరిధిలో వారికి 20 వేల రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం కల్పిస్తున్నాము.
గౌరవ చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే తమ హయాంలో ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు.
రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతోనే అసత్యాలను చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం గౌరవ చంద్రబాబు కు ఉన్నట్లు ఎక్కడా కనపడట్లేదు.
వాలంట్రీలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మంచి చేయాలనే చూస్తున్నారు.
పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే సీఎం గారు ఓటిఎస్ కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకే ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటరీ ఉంటాడు కనుక..ప్రజలకు వెళ్లి ఓటిఎస్ గురించి వివరిస్తున్నారు. అంతేకానీ బలవంతపు వసూలు ఎక్కడా లేదు.
రేపటి రోజు అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
గత హయాంలో చంద్రబాబు సీఎం గా వున్నప్పుడు ఎందుకు ఉచితంగా చేయలేదు.
చంద్రబాబు రుణమాఫీ అన్నారు..చేయలేదు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు..ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నాడు..ఇవ్వలేదు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు..చేయలేదు.
టీడీపీ పాలనలో ప్రజలందరికి హామీలిచ్చి మోసం చేశారు కనుకనే..వైస్సార్సీపీ కి 151 సీట్లు ఇచ్చి జగన్ గారిని సీఎం చేశారు.
టీడీపీ నాయకులు, చంద్రబాబు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరుకుంటున్నాను.
addComments
Post a Comment