న్యూఢిల్లీ – ఫిబ్రవరి 9, (ప్రజా అమరావతి) :
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీల మీడియా సమావేశం
కేంద్ర బడ్జెట్ పై ఈ రోజు సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో ఎం.పీ లు లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, నందిగామ సురేశ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
• ఫెర్టిలైజర్స్ సబ్సీడీని 25 శాతం తగ్గించి రైతులకు అన్యాయం చేశారన్నారు.
• పీఎం గరీభ్ అన్న యోజన పథకం ప్రస్తావన బడ్జెట్ లో లేదన్నారు .
• ఉపాధి హామీ పథకానికి కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గించారన్నారు.
• గ్రామీణాభివృద్ధి పథకాలకు కేటాయింపులు తగ్గించారన్నారు.
• స్వయం సహాయక పథకాలకూ బడ్జెట్ లో నిధులు తగ్గించారన్నారు.
• కరోనా సమయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా బడ్జెట్ ఉండాలని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా సూచించారన్నారు.
• కరోనా లో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి సబ్సిడీల్లో కోతలు పెట్టారన్నారు.
• కేంద్ర బడ్జెట్ పేదలు, రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు .
• కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.
addComments
Post a Comment