ప్రతి మూడు నెలలకు ఒకసారి వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం

 పామర్రు, ఫిబ్రవరి 25 (ప్రజా అమరావతి):వయో వృద్ధులను గౌరవించాలని, వారి హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా నయా సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారాం తెలిపారు.

శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం లోని సమావేశ మందిరంలో   వయోవృద్ధుల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో వృద్ధులకు చట్టం లో గల హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించబడింది.

సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన  జిల్లా  న్యాయ సేవ  సాధికార సంస్థ కార్యదర్శి రాజారాం  మాట్లాడుతూ,  ప్రతి మూడు నెలలకు ఒకసారి వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం


ద్వారా వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు సమీక్షించడం,  వారి నుండి వచ్చిన  ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులు దైవంతో సమానమని, వారిని ఆ వయసులో జాగ్రత్తగా కాపాడుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత అని,  వారి హక్కులకు భంగం కలిగించినా,  వారి సంరక్షణ పట్ల అశ్రద్ధ కనబరిచినా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  కమిటీలో ఉన్న అన్ని శాఖలు వారి సమస్యల కోసం సమన్వయంతో పనిచేయాలని, వారి ఆస్తులు, కోర్టు కేసుల ఉత్తర్వుల అమలుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వయోవృద్ధుల వివరాలను పరిశీలించాలని, వారిలో నిస్సహాయంగా,  దీనస్థితిలో ఉన్న వాళ్లను ప్రత్యేకంగా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాలని,  చట్ట ప్రకారం వారికున్న హక్కులు వారి కుటుంబ సభ్యులకు తెలిసేలా అవగాహన కల్పించాలని,  ఇందుకు గాను తాసిల్దార్ స్థాయి నుండి పోలీసు,  పంచాయతీ సెక్రెటరీ వరకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు.  వయో వృద్ధులకు సంబంధించి వ్రృద్దుల సహాయ కోసం నేరుగా లీగల్ సెల్ ఆధార్టీకి ఫిర్యాదు చేయాలని  తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫిర్యాదుల పరిష్కార కొరకు తీసుకుంటున్న చర్యలను,  ప్రగతిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.  వారిని అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందని, అవసరమైతే సంరక్షణ కేంద్రంలో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం జిల్లా ఉయ్యూరు వృద్ధుల సంఘ నేత వెంకటేశ్వరరావు, కార్యదర్శి బాబురావు, పామర్రు సీనియర్ సిటిజన్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పూసల కోటేశ్వరరావు, సీనియర్ సిటిజన్ నాయకులు చిమట సూర్యనారాయణ, పసుపులేటి నారాయణరావు, జనార్దన్ రావు గుమ్మడి జగదీశ్వరరావు రాఘవేంద్ర రావు మండకమలాకర్ నాథ్, పర్వతనేని బోస్, గ్రామ సర్పంచి కే కస్తూరి, రికార్డు ఏఎస్ఐ పాల్ రాజ్ మతే వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి సుబ్బారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Comments