గుంటూరు, ఫిబ్రవరి 19, (ప్రజా అమరావతి) :-. ఈ నెల 21 వ తేది *సోమవారం డయల్ యువర్ కలెక్టర్ మరియు ప్రజల నుండి వినతి ప్రత్రాలు స్వీకరించే స్పందన కార్యక్రమం కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 వ తేది ఉదయం 10 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని* డీఆర్ఓ ఆ ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.
addComments
Post a Comment