విశాఖ (ప్రజా అమరావతి);
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమసాగు కొనసాగుతుంది
పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి
గంజాయి ని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టాము
గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు...అన్ని విధానాలు అయిన మార్గాలు ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు
మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారు..దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు...
ఓడిసా లో 23 జిల్లాలో,విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో గంజాయి సాగు అవుతుంది..
ఆపరేషన్ పరివర్తన ద్వారా 11 మండలాల్లో 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో 9251.32 కోట్లు విలువ చేసే 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేసాం...చేస్తునే ఉంటాం...
గిరిజనులు స్వచ్ఛందంగా 400 ఎకరాలు ధ్వంసం చేసారు...
గంజాయి నివారణ కోసం 120 అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఎర్పాటు చేసాము
ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా విశాఖ లో గంజాయి సాగు సరఫరా చేస్తున్న వారిపై 577 కేసులు నమోదు చేసి 1500 మందిని అరెస్ట్ చేసాము..
ఇప్పటి వరకు 47,987 కిలోల గంజాయి స్వాదినం చేసుకున్నాము
46.41 లీటర్లు హషిష్ ఆయిల్ స్వాధినం చేసుకున్నాము
314 వాహనాలు సీజ్ చేసాము
ఇతర రాష్ట్రాల కు చెందిన 154 మంది స్మగ్లర్లు తో పాటు కొత్తగా 300 పై కొత్తగా హిస్టరీ షీట్లు తెరిచాము..
నాలుగు జిల్లాలో 1,363 కేసులు నమోదు చేసాము
నాలుగు జిల్లాల పరిధిలో పట్టుబడిన 2 లక్షల కేజీల గంజాయి తగలు పెడుతున్నాము
ఏజెన్సీలో నక్సల్ ప్రభావం తగ్గిపోతుంది...ఏజెన్సీలో మార్పు మొదలైంది....
గిరిజనుల గంజాయి సాగు వైపు వెళ్లకుండా 1963 అవగాహన కార్యక్రమాలు 93 ర్యాలీలు నిర్వహించాము....
గిరిజనుల కు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళే లా చేస్తాము
గంజాయి ఇప్పుడు హషిష్ ఆయిల్ రూపంలో కొత్త రూపం తీసుకుంది..
దాని మీద కూడ ఉక్కపాదం మోపుతున్నాము
పోలీసులు గంజాయి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని రాజకీయ నాయకులు అనడం సరికాదు
సరైన సమాచారం విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు..ఇది చాల బాదకరం...
addComments
Post a Comment