గుడివాడ నియోజకవర్గ చరిత్రలో సువర్ణధ్యాయం ఫ్లైఓవర్ నిర్మాణం



- గుడివాడ నియోజకవర్గ చరిత్రలో సువర్ణధ్యాయం ఫ్లైఓవర్ నిర్మాణం


- నెరవేరుతున్న మంత్రి కొడాలి నాని దశాబ్దాల నాటి కల

- ఐకాన్ బ్రిడ్జ్ తరహాలో ఫ్లైఓవర్ ను తీర్చిదిద్దుతాం

- ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)



గుడివాడ, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా  గుడివాడ పట్టణంలో భీమవరం, మచిలీపట్నం రైల్వే లైన్ లను కలుపుతూ నిర్మించే ఫ్లైఓవర్ గుడివాడ నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవనుంది.

రూ.317.22 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దశాబ్దాల నాటి కల నెరవేరనుంది. దీన్ని ఐకాన్ బ్రిడ్జి తరహాలో మంత్రి కొడాలి నాని తీర్చిదిద్దనున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

దీన్నిబట్టి మంత్రి కొడాలి నాని మాటల మంత్రి కాదని ప్రత్యర్థులకు సైతం ధీటుగా జవాబు చెప్పినట్టు అయింది. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఈసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కొడాలి నానిపై ప్రజలు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మంత్రి కొడాలి నాని పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిన  గుడివాడ ఆర్టీసీ బస్టాండ్, ఫ్లైఓవర్ నిర్మాణాలను ప్రారంభించగలిగారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గుడివాడ పట్టణంలోని పామర్రు రోడ్ లో గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ లు ఉన్నాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా భీమవరం,  మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఆటో నగర్ ప్రజలతోపాటు గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గుడివాడ పట్టణం నుండి పామర్రు, మచిలీపట్నం ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కు పోతున్నాయి. దీంతో రెండు రైల్వే ట్రాక్ లపై ఫ్లై ఓవర్ లను నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఎన్నిక కావడం, వరుసగా నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఫ్లైఓవర్  నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి మంత్రి కొడాలి నానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో భాగంగా అనేకసార్లు గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణం అంశాన్ని ఎంపీ బాలశౌరి పార్లమెంట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఫ్లై ఓవర్ నిర్మించే ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు రావు. అయినప్పటికీ గుడివాడ పట్టణంలోని భీమవరం,  మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల సమస్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఎంపీ బాలశౌరి తీసుకువెళ్లారు. సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్-3 గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర, లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్- 52 విజయవాడ- భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి నేషనల్ హైవే డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మంత్రి కొడాలి నాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. మొదట రూ.220 కోట్లకు అనుమతులు వచ్చాయి. మంత్రి కొడాలి నాని సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో రూ.317.22 కోట్లకు అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన 1.2 హెక్టార్ల భూమికి కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. ఇదిలా ఉండగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి  మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు వరకు ఫ్లైఓవర్ వరకు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల మీదుగా 2.9 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. మార్గమధ్యంలో గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్, మచిలీపట్నం వైపు వెళ్లే రోడ్డు, ఆటోనగర్ రోడ్డు ఉన్నాయన్నారు. మూడు వైపుల నుండి వచ్చే వాహనాలను కలుపుతూ ఫ్లైఓవర్ డిజైన్ లో కొన్ని మార్పులు, చేర్పులు కోరామన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ వల్లభనేని బాలశౌరి తీసుకు వెళ్లారని తెలిపారు. భావితరాలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. మచిలీపట్నం వైపు నుండి, బైపాస్ రోడ్డు నుండి, ఆటోనగర్ వైపునుండి వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గుడివాడ పట్టణం పెద్ద కాలువ సెంటర్ లో మచిలీపట్నం వెళ్లే రోడ్డు వద్ద ఒక ర్యాంపు, ఓల్డ్ బైపాస్ రోడ్డు వద్ద మరో ర్యాంపును నిర్మిస్తామని తెలిపారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుండి ఎంపీ బాలశౌరికి అత్యధిక మెజార్టీనివ్వాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image