గ్రామీణులకు వరం ఉపాధి హామీ - కరోనా కష్టకాలంలో కూలీలకు బాసట

 గ్రామీణులకు వరం ఉపాధి హామీ

- కరోనా కష్టకాలంలో కూలీలకు బాసట




- ఉపాధితో పాటు అభివృద్ధికి బాటలు

- ఫిబ్రవరి నెలలో ఒక్కరోజులో లక్షకుపైగా పని దినాలు

- రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం

- విరివిగా పండ్ల తోటలు, మొక్కల పెంపకం

- రూ 252 కోట్ల వేతనాలు చెల్లింపు

- జిల్లాలో డ్వామా సంస్థ పనితీరు ప్రశంసనీయం


నెల్లూరు, ఫిబ్రవరి 19 (ప్రజా అమరావతి):

 కరోనా కష్టకాలంలో పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడిన బడుగు జీవులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరంలా మారింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో గ్రామాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధికంగా పని దినాలు కల్పించి వారికి  ప్రభుత్వం ఎంతో భరోసాగా నిలిచింది. అలాగే గ్రామ సచివాలయాలు, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు ఇలా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు ఎక్కువ రోజులు పని లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

 శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4.34 లక్షల కుటుంబాలకు చెందిన 7.55 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఒక కోటి 15 లక్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు రూ 252 కోట్ల రూపాయలను వేతనాలుగా చెల్లించారు .

అంతేకాకుండా 18 వేల 266 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించారు. ఒక్కో కుటుంబానికి ఇంతవరకు సరాసరి 45 పనిదినాలు కల్పించి సరాసరి రోజు కూలి రూ 217 లు  వేతనంగా చెల్లించారు.ఇది జిల్లా ఉపాధి హామీ పథకం చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తోంది. ఈ పథకం ప్రారంభించిన ఈ 14 సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో ఒక్కరోజులో లక్షకుపైగా పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా పేర్కొనవచ్చు. 


ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని లక్ష్యంగా నిర్దేశించారు.ఇందులో భాగంగా 1452 మంది రైతులను గుర్తించి 2510 ఎకరాల్లో అనగా లక్ష్యాలకు మించి అధికంగా 120% మొక్కలు నాటడం జరిగింది.ఇందుకోసం రూ.2 కోట్ల 71లక్షలు ఖర్చు చేశారు. తద్వారా పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లో సైతం ఉద్యాన పంటల సాగు చేసేలా చేస్తుంది.


మరోపక్క జిల్లాలో రహదారుల వెంబడి 447.57 లక్షల రూపాయలతో 1180 కిలోమీటర్ల మేర 4.90 లక్షల మొక్కలు నాటారు. అదేవిధంగా బండ్ ప్లాంటేషన్ కింద 74 మంది రైతులకు చెందిన పొలం గట్లపై అధిక సంఖ్యలో టేకు మొక్కలు వేశారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్లో భాగంగా 115 ప్రభుత్వ సంస్థల్లో 6,118 మొక్కలు నాటారు.


మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జోడించి ముందుకు తీసుకు వెళుతున్నారు.  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 59,106 మంది లబ్ధిదారులకు 2,152.32 ఎకరాల భూమిలో 357 లే అవుట్ల్ లో మౌలిక సదుపాయాలు పనులను మంజూరు చేశారు. రూ. 65.62 కోట్లతో 165 పనులు పూర్తి చేశారు. జిల్లాలో 115 కోట్లతో 659 గ్రామ సచివాలయం భవనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే వాటిలో 282 వరకు పనులు పూర్తి చేశారు.అదే విధంగా ఈ సంవత్సరంలో 50 కోట్ల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలను మంజూరు చేయగా వాటిలో ఇప్పటికే 169 పనులు పూర్తికాగా, మరో 478 పనులు వివిధ దశల్లో ఉన్నాయి .


గ్రామీణ ప్రజానీకానికి మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా రూ.98 కోట్లతో 528 వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఈ పథకం కింద మంజూరు చేశారు. ఇప్పటికే వీటిలో 75 పనులు పూర్తికాగా ,మరో 444 భవన నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలో పాడి రైతులకు ఆర్ధిక తోడ్పాటు కల్పించాలనే దిశగా పాలవెల్లువ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 25.76 కోట్ల విలువైన 163 పాల శీతలీకరణ కేంద్రాలను మంజూరు చేయగా వాటి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. 


గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా యువతకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువచేసే దిశగా రూ.60.80 కోట్లతో జిల్లాలో 378 వైయస్సార్ డిజిటల్ లైబ్రరీ లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 336 పనులు పురోగతిలో ఉన్నాయి. 

 మరోపక్క జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు నిర్మాణాలను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 42.16 కోట్ల విలువైన 606 పనులను మంజూరు చేయగా వాటిలో 404 పనులు ప్రగతి లో ఉన్నాయి. అలాగే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన గ్రామ కొలనుల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.


జిల్లాలో ఉపాధి హామీ పథకంతో సత్ఫలితాలు

- జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు


జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామీణులకు మెరుగైన ఉపాధి అవకాశాలు చూపిస్తున్నాం.  గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో గ్రామాల్లో కూలీలకు ఎక్కువ పని దినాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 90 రోజుల ఉపాధి హామీ పని దినాలు కల్పించి ఆ మేరకు నగదును జమ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో  డ్వామా పిడి శ్రీ తిరుపతయ్య ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది  చేస్తున్న కృషి అభినందనీయం.


లబ్ధిదారుల అభిప్రాయాలు


 1). జీవనోపాధితో పాటు గ్రామ అవసరాలు తీరుతున్నాయి 

- పాదర్తి పెంచలయ్య, పాత వెల్లంటి.

నా వయసు 60 సంవత్సరాలు. నేను కరువు పని చేసుకొని ప్రభుత్వం వారు ఇచ్చే కూలి డబ్బులతో నా కుటుంబాన్ని పోషించు కుంటున్నాను. మా గ్రామంలో పశువులకు తాగునీటి అవసరాల కోసం పశువుల కుంటలను  ఈ పథకం కింద తవ్వుతున్నాం. దీంతో గ్రామంలోని పశువులకు తాగునీరు లభించడమే కాకుండా మాకు కూడా జీవనోపాధి ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతుంది. 


2).  పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం ఎంతో ఆదుకుంటుంది

- నాగ భూషణమ్మ, పాత వెల్లంటి


నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త కూలి పనులు చేస్తుంటాడు. నేను కూడా పొలం పనులు చేస్తుంటాను. పొలం పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం పనులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నా భర్త, నా కూలీ డబ్బులతో మా పిల్లల్ని బి ఫార్మసీ చదివిస్తున్నాను. ఈ వయసులో బయట ప్రాంతాలకు వెళ్లి పనులు చేయలేని మాలాంటి వారికి స్థానికంగా ఉపాధి పనులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 


3). కరోనా సమయంలో ఉపాధి పనులే ఆదుకున్నాయి

- వన్నం సుగుణమ్మ, పాత వెల్లంటి

కరోనా సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న మాకు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కలిగింది. మేము చేసిన పనికి లెక్కగట్టి డబ్బులను మా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఈ డబ్బులు మా కుటుంబ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే గ్రామంలో చెరువులు, కుంటల పనులన్నీ ఈ పథకం కింద పూర్తయి గ్రామ అవసరాలు తీరుతున్నాయి. 


Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image