ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి చెందిన వారికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు

 ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి చెందిన వారికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు


సచివాలయంలో 1902 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

0863-2340678తో హెల్ప్ లైన్ కేంద్రం,+91-8500027678 వాట్సప్ గ్రూప్ 

సుమారు 300 మంది వరకూ వాట్సప్ గ్రూప్ లో విద్యార్ధులు రిజిష్టర్ అయ్యారు

ఉక్రెయిన్ లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలి సరహద్దులకు రావద్దు

ప్రభుత్వ ఖర్చుతో స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు

రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు యం.టి.కృష్ణబాబు

అమరావతి,26 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఉక్రెయిన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉక్రెయన్ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు యం.టి కృష్ణబాబు పేర్కొన్నారు.ఈమేరకు శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చే విషయమై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి విదేశాంగ మంత్రివర్యులకు లేఖ వ్రాశారన్నారు.ఉక్రెయిన్ సంక్షోభంపై అమరావతి సచివాలయం మొదటి బ్లాకు ఆర్టీజిఎస్ లో తన నేతృత్వంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.ఈకమిటీలో సభ్య కన్వీనర్ గా ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం)గితేశ్ శర్మ,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు, ఢిల్లీలోని ఎపి భవన్ అదనపు రెసిడెంట్ కమీషనర్ హిమాన్షు కౌశిక్,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ బి.శ్రీనివాస రావు,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్,అందరు జిల్లా కలక్టర్లు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.ఈకమిటీ ఆధ్వర్యంలో 1902 నంబరుతో కంట్రోల్ రూమ్,0863-2340678 ల్యాండ్ లైన్ నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రం నిరంతరం పనిచేస్తుందని ఆయన వివరించారు.అలాగే +91-8500027678 తో వాట్సప్ గ్రూప్ కూడా ఉందని కృష్ణబాబు తెలిపారు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న కొంత మంది విద్యార్థులతో రాష్ట్ర స్థాయి హెల్ప్ లైన్‌ కేంద్రం ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని కృష్ణబాబు తెలిపారు.ఎటియంలలో డబ్బులు లేవనో లేక ఆహారం,తాగునీరు వంటి నిత్యావసరాల కొరతనే విద్యార్ధులు కొంత ఆందోళన చెందే వీలుందని అఁదకు మించి పెద్దగా ఆందోళనకర పరిస్థితులు ఉండవని అనుకుంటున్నట్టు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఉక్రెయిన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆరాతీసి వారి వివరాలను సేకరించడం కోసం విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను కూడా పంపగా ఇప్పటి వరకూ 360 మంది వరకూ విద్యార్థుల డేటా రిజిష్టర్ అయ్యారని కృష్ణబాబు వివరించారు.రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు ఢిల్లీ లోను ఎపిభవన్ అధికారులు ఎప్పటికప్పుడు విదేశాంగశాఖ అధికారులతోను ఉక్రెయన్ ఎంబసీతోను మాట్లాడుతూ మాట్లాడడం జరుగుతోందని ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మీడియాకు వివరించారు.కమాండ్ కంట్రోల్ రూమ్‌ ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోగల మన విదేశాంగశాఖ ఇన్‌చార్జిలు ఫోన్ నంబర్లు,అన్నిసలహాలు ఈగ్రూప్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతోందని తెలిపారు.

బుకారెస్ట్ నుండి ఢిల్లీ,ముంబాయిలకు చేరుకోనున్నరెండు విమానాలు-ఉచిత రవాణా.

ఉక్రెయిన్ లో ఉన్నవారిని ఉచితంగా విమానాల ద్వారా మనదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టాస్ పోర్సు కమిటీ అధ్యక్షులు కృష్ణబాబు చెప్పారు.ఆవిధంగా వచ్చిన వారిలో మన రాష్ట్రానికి చెందిన వారిని ఉచితంగా విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.బుకారెస్టు నుండి 27వతేదీ ఆదివారం ఉ.2.30గం.లకు ఢిల్లీకి ఒక విమానం చేరుకోనుండగా దానిలో తెలుగు విద్యార్ధులు 13 మంది ఉన్నారని,అలాగే ముంబైకి మరో విమానం 26వతేదీ శనివారం రాత్రి రానుండగా దానిలో 9మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారని చెప్పారు.

ఈమీడియా సమావేశంలో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సభ్య కన్వీనర్  ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం)గితేశ్ శర్మ,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ బి.శ్రీనివాస రావు,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్ పాల్గొన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image