తాడేపల్లి (ప్రజా అమరావతి);
వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతే ధ్యేయంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ గారి మార్గదర్శకత్వం లో ఆంధ్రప్రదేశ ప్రభుత్వ సంస్థ APNRTS పనిచేస్తోంది. కొన్నిరోజులుగా ఉక్రెయిన్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యం లో భారతీయులు స్వదేశం రావాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు 23.02.2022వ తేదీన గౌరవ విదేశాంగ శాఖ మంత్రి డా. జై శంకర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఉక్రెయిన్ నుండి భారతదేశానికి చెందిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిల్లి లోని ఏపీ భవన్ అధికారులను అప్రమత్తం చేసింది.
మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభం విషయం లో నాలుగు వారాలుగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ పలు చర్యలు తీసుకుంది.
1. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారి గురించి తెలుసుకునేందుకు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయానికి APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారు 30 జనవరి 2022న ఇ మెయిల్ పంపారు. ఈ ఇమెయిల్ లో అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల జాబితా పంపమని, అలాగే భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్న తెలుగు విద్యార్థులు మరియు ఉద్యోగుల సమాచారాన్ని అందించమని అభ్యర్థించడం జరిగింది. ఉక్రెయిన్ నుండి స్వదేశానికి రావాలనుకునే ప్రవాసాంధ్రులకు సహాయం చేయడానికి APNRTS అవసరమైన చర్యలు తీసుకుంది.
2. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాకుండా APNRTS వెబ్సైట్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్లైన్ నంబర్లు 0863 234 0678, వాట్సాప్ నంబరు: 85000 27678 అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థుల కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్ల హైపర్లింక్లు, MEA యొక్క హెల్ప్లైన్ నంబర్లు మరియు భారతీయ-ఉక్రెయిన్ కంట్రోల్ రూమ్ నంబర్లు APNRTS వెబ్సైట్ మరియు సోషల్ మీడియా గ్రూప్లలో పోస్ట్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు MEA హెల్ప్లైన్ మరియు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం తెలుసుకుని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతోంది. స్వదేశానికి రప్పించే ప్రక్రియలో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి APNRT సొసైటీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసివ్ చేసుకుని అక్కడి పరిస్థితులను తెలియజేస్తోంది.
3. APNRT సొసైటీ విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ....వారిని ఎంబసీ వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తోంది.
4. MEA మరియు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నుండి తరచుగా అడిగే ప్రశ్నలు మరియు ఇతర సమాచారాన్ని APNRTS ను సంప్రదిస్తున్న మీడియా ప్రతినిధులకు తెలియజేస్తోంది.
5. కోవిడ్ సమయంలో ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి తిరిగొచ్చిన విద్యార్థుల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవడం జరుగుతోంది..ఇందులో భాగంగా ఇవాళ మరి కొంత మంది విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించింది. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.
6. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ. ఆదిమూలపు సురేష్ గారు ఇవాళ విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తోంది.
7. రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులుగా శ్రీ గితేష్ శర్మ, ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) ఫోన్: 9871999055 మరియు డిల్లిలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ. రవి శంకర్ లను ఫోన్: 7531904820 నియమించింది. ఇవాళ APNRTS సీఈఓ శ్రీ. దినేష్ కుమార్ రవిశంకర్ గారితో మాట్లాడి ఉక్రెయిన్ లోని విద్యార్థుల జాబితాను పంపించడం జరిగింది.
8. దీనికి అదనంగా, శ్రీ. గితేష్ శర్మ ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు సెక్రటరీ (ఈస్ట్ & వెస్ట్) కి లేఖ రాశారు.
9. APNRTS 24/7 హెల్ప్లైన్ అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మద్దతు మరియు మార్గదర్శకత్వాన్ని అందించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తోందని APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి అన్నారు.
10. కేంద్ర ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి రప్పించే క్రమంలో, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయము చేసుకొని ఏపీకి చెందిన వారిని క్షేమంగా రాష్ట్రానికి తరలించాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు.
కె. దినేష్ కుమార్,
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
మొబైల్: 98484 60046
addComments
Post a Comment