ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు. గన్నవరం ఏప్రిల్ , 18 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి గన్నవరం విమానాశ్రయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యరెడ్డి, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రామారావు, ప్రభృతులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంట మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు దంపతులు కూడా విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.
addComments
Post a Comment