ఘ‌నంగా కోదండ‌రామాల‌య‌ పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, ఉన్న‌తాధికారులు

 


ఘ‌నంగా కోదండ‌రామాల‌య‌ పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం

త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, ఉన్న‌తాధికారులు



 ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః

ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌


రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హిస్తాం ః మంత్రి బొత్స‌


నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 25 (praja అమరావతి) ః

                   శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం రామ‌తీర్ధంలోని బోడికొండ (నీలాచ‌లం)పై సోమ‌వారం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఆగ‌మ శాస్త్ర‌ పండితుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగిన ఈ ఉత్స‌వంలో రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొని, హ‌నుమ‌స్స‌మేత శ్రీ సీతారామల‌క్ష్మ‌ణ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.


                   వేద‌పండితులు నిర్ణ‌యించిన  ముహూర్తం ప్ర‌కారం, ఉద‌యం 7 గంట‌ల 37 నిమిషాల‌కు విగ్ర‌హాల ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది. ఉద‌యం రుష్య‌క్సేన ఆరాధ‌న‌తో ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. అనుంత‌రం శాస్త్ర‌బ‌ద్దంగా పుణ్యావ‌హ‌చ‌నం, అగ్ని ప్ర‌జ్వ‌ళ‌న‌, ర‌త్నాన్యాసం, యంత్ర‌స్థాప‌న‌, విగ్ర‌హ ప్ర‌తిష్ట‌, ద్వ‌జ‌స్థంబ ప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌ శిఖ‌ర ప్ర‌తిష్ట‌, ఏక‌శాల పూర్ణాహుతి, త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేశారు. రామ‌తీర్ధం శ్రీ సీతారామ‌స్వామి ఆల‌య‌ ప్ర‌ధానార్చ‌కులు ఖండ‌వ‌ల్లి సాయిరామాచార్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, ద్వార‌కా తిరుమ‌ల దేవ‌స్థానం ఆగ‌మ పండితుల నేతృత్వంలో, శుక్ర‌వారం నుంచే వైఖాన‌స ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం శ్రీ‌కారం చుట్టిన‌ ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వాలు, సోమ‌వారం నిర్వ‌హించిన శాంతి క‌ల్యాణంతో ముగిశాయి.


                  ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, దేవాదాయ శాఖామంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్ర దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంఎల్‌సిలు డాక్ట‌ర్ సురేష్‌బాబు, ఇందుకూరి ర‌ఘురాజు, ఎంఎల్ఏలు బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, ఎంపిపి అంబ‌ళ్ల సుధారాణి, ఆర్‌డిఓ అప్పారావు, దేవాదాయ‌శాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ వి.శ్రీ‌నివాస‌రెడ్డి, దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌య ఈఓ బ్ర‌మ‌రాంభ‌, జిల్లా దేవాదాయ‌శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్ జె.వినోద్ కుమార్‌, రామ‌తీర్ధం ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ డివివి ప్ర‌సాద‌రావు, తాశీల్దార్ ర‌మ‌ణ‌రాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్‌, టూరిజం డైరెక్ట‌ర్ రేగాన శ్రీ‌నివాస‌రావు, ప‌లువురు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః

ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

                   శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునః ప్ర‌తిష్ట అనంత‌రం, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, కొండ దిగువ‌నున్న శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు వారికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, అతి త‌క్కువ కాలంలోనే ఆల‌యాన్ని పునర్‌నిర్మించి, విగ్ర‌హాల‌ను పునఃప్ర‌తిష్ట చేయ‌డం, ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. కొన్ని నెల‌ల క్రితం రాష్ట్రంలో వివిధ చోట్ల‌ ఆల‌యాల‌ను ద్వంసం చేసి, ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించార‌ని, అటువంటి వారికి ఆ దేవుడే త‌గిన శాస్తి చేస్తాడ‌ని అన్నారు. దేవుడిపై ఎంతో విశ్వాసం ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, చిత్త‌శుద్దితో కృషి చేసి, సుమారు రూ.3కోట్ల వ్య‌యంతో ఆల‌యాన్ని కొద్ది కాలంలోనే పునర్‌నిర్మించార‌ని చెప్పారు. బోడికొండ‌పై విగ్ర‌హాల‌ను ద్వంసం చేసిన దుశ్చ‌ర్య‌కు సంబంధించి, కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, దోషుల‌ను ప‌ట్టుకొని తీరతామ‌ని మంత్రి చెప్పారు.


రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌తిపాద‌న‌లు

విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

                   రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హించే ప్ర‌తిపాద‌న ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప‌రిశీల‌న‌లో ఉంద‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌లో రామ‌తీర్ధం శ్రీ సీతారామ‌స్వామి ఆల‌య ఎంతో ప్ర‌సిద్ది అని, భ‌ద్ర‌చ‌లంలో శ్రీ‌రామ న‌వ‌మి రోజు జ‌రిగిన‌ట్టే, ఇక్క‌డ కూడా అదే సంప్ర‌దాయంలో వేడుక‌లు జ‌రుగుతాయ‌ని అన్నారు. ఆగ‌మ పండితులు, చిన జీయ‌ర్ స్వామివారు నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా, శాస్త్రోక్తంగా ఆల‌య పునఃప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింద‌ని చెప్పారు. శ్రీ సీతారాముల ద‌య‌తో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉండాల‌ని బొత్స ఆకాంక్షించారు.


దేవాదాయ‌శాఖ ఇంజ‌నీర్ల‌కు స‌న్మానం

                    కేవ‌లం 110 రోజుల్లోనే కొండ‌పై ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేసిన దేవాదాయ‌శాఖ‌కు చెందిన ప‌లువురు ఇంజ‌నీర్ల‌ను మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ చేతుల‌మీదుగా, దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ స‌న్మానించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ దుర్గేష్‌కుమార్‌, డిఇఇలు కెవిసి కృష్ణ‌, ఎఇ భానుచంద్‌, సైదా, ఎఇ భానుచంద్ స‌న్మానాన్ని అందుకున్నారు.

.

                 



ఘ‌నంగా కోదండ‌రామాల‌య‌ పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం

త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, ఉన్న‌తాధికారులు


 ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః

ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌


రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హిస్తాం ః మంత్రి బొత్స‌


నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 25 ః

                   శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం రామ‌తీర్ధంలోని బోడికొండ (నీలాచ‌లం)పై సోమ‌వారం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఆగ‌మ శాస్త్ర‌ పండితుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగిన ఈ ఉత్స‌వంలో రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొని, హ‌నుమ‌స్స‌మేత శ్రీ సీతారామల‌క్ష్మ‌ణ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు.


                   వేద‌పండితులు నిర్ణ‌యించిన  ముహూర్తం ప్ర‌కారం, ఉద‌యం 7 గంట‌ల 37 నిమిషాల‌కు విగ్ర‌హాల ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది. ఉద‌యం రుష్య‌క్సేన ఆరాధ‌న‌తో ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. అనుంత‌రం శాస్త్ర‌బ‌ద్దంగా పుణ్యావ‌హ‌చ‌నం, అగ్ని ప్ర‌జ్వ‌ళ‌న‌, ర‌త్నాన్యాసం, యంత్ర‌స్థాప‌న‌, విగ్ర‌హ ప్ర‌తిష్ట‌, ద్వ‌జ‌స్థంబ ప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌ శిఖ‌ర ప్ర‌తిష్ట‌, ఏక‌శాల పూర్ణాహుతి, త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేశారు. రామ‌తీర్ధం శ్రీ సీతారామ‌స్వామి ఆల‌య‌ ప్ర‌ధానార్చ‌కులు ఖండ‌వ‌ల్లి సాయిరామాచార్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, ద్వార‌కా తిరుమ‌ల దేవ‌స్థానం ఆగ‌మ పండితుల నేతృత్వంలో, శుక్ర‌వారం నుంచే వైఖాన‌స ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం శ్రీ‌కారం చుట్టిన‌ ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వాలు, సోమ‌వారం నిర్వ‌హించిన శాంతి క‌ల్యాణంతో ముగిశాయి.


                  ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, దేవాదాయ శాఖామంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్ర దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంఎల్‌సిలు డాక్ట‌ర్ సురేష్‌బాబు, ఇందుకూరి ర‌ఘురాజు, ఎంఎల్ఏలు బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, ఎంపిపి అంబ‌ళ్ల సుధారాణి, ఆర్‌డిఓ అప్పారావు, దేవాదాయ‌శాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ వి.శ్రీ‌నివాస‌రెడ్డి, దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌య ఈఓ బ్ర‌మ‌రాంభ‌, జిల్లా దేవాదాయ‌శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్ జె.వినోద్ కుమార్‌, రామ‌తీర్ధం ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ డివివి ప్ర‌సాద‌రావు, తాశీల్దార్ ర‌మ‌ణ‌రాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్‌, టూరిజం డైరెక్ట‌ర్ రేగాన శ్రీ‌నివాస‌రావు, ప‌లువురు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః

ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

                   శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునః ప్ర‌తిష్ట అనంత‌రం, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, కొండ దిగువ‌నున్న శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు వారికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, అతి త‌క్కువ కాలంలోనే ఆల‌యాన్ని పునర్‌నిర్మించి, విగ్ర‌హాల‌ను పునఃప్ర‌తిష్ట చేయ‌డం, ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. కొన్ని నెల‌ల క్రితం రాష్ట్రంలో వివిధ చోట్ల‌ ఆల‌యాల‌ను ద్వంసం చేసి, ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించార‌ని, అటువంటి వారికి ఆ దేవుడే త‌గిన శాస్తి చేస్తాడ‌ని అన్నారు. దేవుడిపై ఎంతో విశ్వాసం ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, చిత్త‌శుద్దితో కృషి చేసి, సుమారు రూ.3కోట్ల వ్య‌యంతో ఆల‌యాన్ని కొద్ది కాలంలోనే పునర్‌నిర్మించార‌ని చెప్పారు. బోడికొండ‌పై విగ్ర‌హాల‌ను ద్వంసం చేసిన దుశ్చ‌ర్య‌కు సంబంధించి, కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, దోషుల‌ను ప‌ట్టుకొని తీరతామ‌ని మంత్రి చెప్పారు.


రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌తిపాద‌న‌లు

విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

                   రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హించే ప్ర‌తిపాద‌న ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప‌రిశీల‌న‌లో ఉంద‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌లో రామ‌తీర్ధం శ్రీ సీతారామ‌స్వామి ఆల‌య ఎంతో ప్ర‌సిద్ది అని, భ‌ద్ర‌చ‌లంలో శ్రీ‌రామ న‌వ‌మి రోజు జ‌రిగిన‌ట్టే, ఇక్క‌డ కూడా అదే సంప్ర‌దాయంలో వేడుక‌లు జ‌రుగుతాయ‌ని అన్నారు. ఆగ‌మ పండితులు, చిన జీయ‌ర్ స్వామివారు నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా, శాస్త్రోక్తంగా ఆల‌య పునఃప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రిగింద‌ని చెప్పారు. శ్రీ సీతారాముల ద‌య‌తో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉండాల‌ని బొత్స ఆకాంక్షించారు.


దేవాదాయ‌శాఖ ఇంజ‌నీర్ల‌కు స‌న్మానం

                    కేవ‌లం 110 రోజుల్లోనే కొండ‌పై ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేసిన దేవాదాయ‌శాఖ‌కు చెందిన ప‌లువురు ఇంజ‌నీర్ల‌ను మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ చేతుల‌మీదుగా, దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ స‌న్మానించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ దుర్గేష్‌కుమార్‌, డిఇఇలు కెవిసి కృష్ణ‌, ఎఇ భానుచంద్‌, సైదా, ఎఇ భానుచంద్ స‌న్మానాన్ని అందుకున్నారు.


                 





                           

                



                           

                

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image