పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే చెప్పా



*»» పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధమని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే చెప్పా*


 

 *»» గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా* 

 *»» ఎమ్మెల్యే అని పిలిపించుకోవటమే నాకు ఇష్టం* 

 *»» మంత్రి పదవి లేకపోతే బాధపడను* 

 *»» నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు కాదనుకుంటే బాధపడాలి* 

 *»» పదవి కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు లాంటి వ్యక్తిని కాదు* 

 *»» 30 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగాలి* 

 *»» సీఎం జగన్ కుర్చీని లాక్కోవాలని  గుంటనక్కల్లా చూస్తున్నారు* 

 *»» రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కార్యకర్త అడ్డుకోవాలి* 

 *»» గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపు*


 గుడివాడ, ఏప్రిల్ 23 (ప్రజా అమరావతి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్మోహన్ రెడ్డితోనే చెప్పానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా  గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శనివారం  మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రాం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చాలామంది పెద్దలు మాజీ మంత్రి అని తనను సంబోధిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు అన్నింటికన్నా ఇష్టమైన పదవి ఎమ్మెల్యే అని చెప్పారు. తన గురించి సంభోదించేటప్పుడు స్థానికులు ఎమ్మెల్యే అని, బయటి ప్రాంతం వారైతే గుడివాడ ఎమ్మెల్యే అనాలని కోరారు. మంత్రి పదవి పోతే తాను బాధపడని చెప్పారు. ఎమ్మెల్యే పదవిని ప్రజలే ఇస్తారని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని రెండు లక్షల మంది ఓటర్లు తనను కాదనుకుంటే బాధపడాలని చెప్పారు. రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు, కులాల సమీకరణాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడడం జరిగిందన్నారు. ఇంకా కొన్ని వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశం కనబరిచానని తెలిపారు.

ఇందుకోసం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపామన్నారు. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరామన్నారు.

ఇంకో 30 ఏళ్ళ పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి  కొనసాగాలని ఆకాంక్షించామని చెప్పారు. మంత్రి పదవి ముఖ్యం కాదని, ఏ నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఆమోదిస్తామని చెప్పామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి పార్టీలో, ప్రభుత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని  స్పష్టం చేశామన్నారు. దీంతో మంత్రి పదవి నుండి తప్పించి పార్టీ పదవులను అప్పగించారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. అటువంటి నాయకుడు దగ్గర పని చేయడం తమకు ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మంత్రి పదవా, పార్టీ పదవా అనేది ముఖ్యం కాదన్నారు. పదవులు కొడాలి నానికి ఈక  ముక్క లాంటివని చెప్పారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు లాంటి వ్యక్తిని కాదని చెప్పారు. తన గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఆయనతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రజల అభ్యున్నతి కోసమే జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని 420 బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు.

ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, చంద్రబాబులను 420 బ్యాచ్ గా అభివర్ణించారు.డబ్బా ఛానల్స్లో డిబేట్ లు పెట్టి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతోందని, పేదల సంక్షేమానికి ఏ విధంగా డబ్బులు పంచుతారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

లక్షల కోట్లు పేదల జేబుల్లోకి వెళ్తే సోమరులు అవుతారని అంటున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే పేదలు ఎక్కడా పనులు చేయడం లేదా అని ప్రశ్నించారు. కుటుంబ, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత  పేదలకు ఆసరాగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీని ఎలా లాక్కోవాలని గుంట దగ్గర నక్కల్లా చూస్తున్నారన్నారు. ఇటువంటి దొంగ ప్రయత్నాలను ప్రజలంతా ఆపాలని పిలుపునిచ్చారు.

జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ కు అధికారం కట్టబెడితే 8 నెలల్లోనే కొంతమంది దుర్మార్గులు ఆయనకు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. ఆ తర్వాత గుంట నక్కలు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కోటాను కోట్లు సంపాదించారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఆయన బతికి ఉంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలవనిచ్చేవారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇప్పుడున్న ఆర్థిక సమస్యలు ఉండేది కాదని తెలిపారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు కాకుండా సమైక్యంగా ఉంచగలిగే శక్తి దివంగత రాజశేఖర్ రెడ్డికి ఉందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం వల్లే రాష్ట్రం సర్వ నాశనమైందని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకుని పుట్టిన జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం పాటు పడుతున్నారని చెప్పారు. ఏదో విధంగా  సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుండి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్ కార్యకర్త, సామాన్య ప్రజానీకం ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image