జూన్ 6న రైతు రధం పధకం ప్రారంభం-సియంచే 3 వేల ట్రాక్టర్లు పంపిణీ

 రైతు భరోసా-పియం కిసాన్ కింద ఇప్పటి వరకూ 23వేల 875కోట్ల రూ.ల సాయం

నాల్గవ విడత రైతు భరోసా-పియం కిసాన్ కింద 3 వేల 758 కోట్ల రూ.లు పంపిణి 

రైతులకు ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ లక్షా 10 వేల కోట్ల రూ.ల సహాయం

2 వేల కోట్ల రూ.లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు 

జూన్ 6న రైతు రధం పధకం ప్రారంభం-సియంచే 3 వేల ట్రాక్టర్లు పంపిణీ


అసని తుఫాన్ నష్టం అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది-ప్రాధమిక అంచనాల ప్రకారం 6వేల హెక్టార్లతో పంటలు నష్టం

        రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి

అమరావతి,మే 16 (ప్రజా అమరావతి):ఈప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద ఇప్పటి వరకూ రైతులకు 23 వేల 875 కోట్ల రూ.ల సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ రైతాంగానికి వివిధ పధకాల కింద లక్షా 10 వేల కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు.వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకాన్ని2019 అక్టోబరులో నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు.అప్పటి నుండి ప్రతి యేటా మూడు విడతలుగా 7 వేల 500 రూ.లు,4వేల రూ.లు,2వేల రూ.లు వంతున ప్రతి రైతుకు ఏడాదికి 13వేల 500 రూ.ల సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.సీజన్ ప్రారంభం కాకముందే పంటల సాగుకు వీలుగా రైతులకు ఈపధకం కింద సహాయం అందించడం జరుగుతోందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి తెలిపారు.ఈఏడాదికి సంబంధించి తొలివిడత సహాయాన్ని సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో 3758 కోట్ల రూ.లను జమ చేశారని చెప్పారు.2019-20 ఏడాదిలో 46 లక్షల 69 వేల మంది రైతులకు రూ.6 వేల 173 కోట్లు,2020-21లో 51 లక్షల 59 వేల మంది రైతులకు రూ.6 వేల 928 కోట్లు,2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 52లక్షల 38వేల మంది రైతులకు 7 వేల 16 కోట్ల రూ.లను జమచేయడం జరిగిందని మంత్రి గోవర్ధన రెడ్డి తెలిపారు.

ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక రైతులకు సున్నావడ్డీ పధకం,పంటల బీమా వంటి వివిధ పధకాల ద్వారా ఇప్పటి వరకూ లక్షా 10వేల కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.అదే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు వంటివి రైతులకు సకాలంలో అందిస్తున్నట్టు చెప్పారు.ఈప్రభుత్వం వచ్చాక 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఫల సాయం వచ్చిందని,48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండిందని మంత్రి మీడియాకు వివరించారు.

సకాలంలో వర్షాలు పడడం,పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడంతో ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక గత 35 మాసాల్లో రాష్ట్రంలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించ లేదని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు.2వేల కోట్ల రూ.లతో ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాల నిధి(Calamity Fund)ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

జూన్ 6న సియం జగన్మోహన్ రెడ్డిచే రైతు రధం పధకం ప్రారంభం-3వేల ట్రాక్టర్లు పంపిణి

వ్యవసాయ యాంత్రీకరణ ప్రక్రియలో భాగంగా జూన్ 6వ తేదీన రైతు రధం పధకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి రైతులకు 3 వేల ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి వెల్లడించారు.

అసని తుఫాను పంట నష్టం అంచనా వేగవంతంగా జరుగుతోంది:మంత్రి కాకాని

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అసని తఫాను కారణంగా దెబ్బతిన్న పంటల నష్టం అంచనా ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి గోవర్ధన రెడ్డి చెప్పారు.ప్రాధమిక అంచనాల ప్రకారం సుమారు 6 వేల హెక్టార్లలో వ్యవసాయ,ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోందని అన్నారు.నియమనిబంధనల ప్రకారం నష్టం అంచనాల ప్రక్రియ పూర్తికాగానే నష్ట పోయిన రైతులందరికీ తగిన నష్ట పరిహారాన్నిఅందించడం జరుగుతుందని మంత్రి గోవర్ధన రెడ్డి మీడియాకు వివరించారు.

      

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image