జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది

  అమలాపురం  23 మే, (ప్రజా అమరావతి): 

        నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో  మొట్టమొదటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అర్థవంతం ఫలవంతంగా జరిగిందని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంద


ని జిల్లా ఇంచార్జ్ మంత్రి, మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ పాలనా సౌలభ్యం కొరకు ప్రజల వద్దకే పాలన పేరిట తొలుత గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయని తదుపరి జిల్లాల పునర్విభజన జరిగిందని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో  జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు అనువైన సూచనలు గౌరవ మంత్రులు శాసనమండలి శాసనసభ్యులు ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశంలో ఖరీఫ్ 2022 సన్నద్ధత కార్యాచరణ ప్రణాళిక పైన, జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ముందస్తు సాగు నీటి విడుదల, గృహ నిర్మాణంలో పురోగతి, పంచాయతీరాజ్ పనులు నాడు-నేడు పాఠశాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆధునీకరణ మరియు అభివృద్ధి పనులు పురోగతిపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రివర్యులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని కాంక్షించి మూడో పంట అపరాల సాగు చేసుకునేలా సీఎం సూచించారని జూన్ ఒకటో తేదీ నుండి సాగునీటిని విడుదల చేయడం ద్వారా మూడవ పంట అపరాల సాగుకు అవకాశాలు ఏర్పడతాయన్నారు. నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గృహనిర్మాణ స్థలాల ఫిల్లింగ్ తదితర సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించి గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 1వ తేదీ నుండి  జలవనరుల శాఖ అధికారులు సాగునీటి విడుదల చేస్తారని, అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులను రైతు భరోసా కేంద్రాలు ద్వారా చైతన్య పర్చడంతోపాటు రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు, సూక్ష్మ పోషకాలు, రైతుల డిమాండ్ అనుగుణంగా సిద్ధ పరచాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఒక మంచి పరిపాలన దిశగా అడుగు ముందుకు వేస్తూ జిల్లాను అన్ని అంశాలలో ముందంజలో నిలపాలని సూచించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమ కార్యక్రమాలు రైతుల కొరకు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతే రాష్ట్ర పురోగతిగా భావించి ముందుకు సాగుతున్నారన్నారు. పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కోనసీమ జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా బలోపేతానికి చర్యలు గైకొనాలన్నారు. ధాన్యం కొనుగోలు సొమ్ములు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుమారు రెండు కోట్ల మేర నిలిచిపోయాయని వాటిని సరిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కోనసీమ జిల్లా అంచెలంచెలుగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రకృతి పరంగా సహజ వనరులు అపారంగా ఉన్న మూలంగా బలోపేతం కాగలదన్నారు జిల్లా పేరు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల గడువు ఇచ్చిందని ఈ లోగా ప్రజానీకం తమ అభిప్రాయాలను అభ్యంతరాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. గడువు నిండిన పిమ్మట ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయ బేరి వైయస్సార్ సీపీ బస్సు యాత్ర కార్యక్రమం ఈనెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు జరగనున్నదని తెలిపారు. సామాజిక న్యాయానికి అద్దంపట్టే రీతిలో  సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు తేట తెల్లం చేయడం జరుగుతుందన్నారు. 25 క్యాబినెట్ మంత్రులులో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించడం ,రాజ్యసభ స్థానాలు నాలుగు కేటాయించడం, శాసనమండలి చైర్మన్ గా ఎస్సీ అభ్యర్థిని, వైస్ చైర్మన్ గా మైనారిటీ అభ్యర్థిని, శాసనసభ చైర్మన్ గా బీసీ అభ్యర్థిని కేటాయించిందన్నారు. 672 బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు కేటాయించి రాష్ట్రప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తోందన్నారు. సామాజిక న్యాయం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్ వల్లే సాకారమైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా  సామాజిక న్యాయ బేరీ వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో మరింతగా ఆత్మరక్షణ, ఆత్మగౌరవాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం   ప్రత్యేక చొరవ చూపుతొందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రాథమిక రంగానికి పొటెన్షియల్ ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. జిల్లా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. 

       ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, ఇళ్ళ వెంకటేశ్వరరావు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు ,కొండేటి చిట్టిబాబు వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, డిఆర్వో సిహెచ్. సత్తిబాబు, జడ్పీ సీఈఓ ఎం వి వి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి వై. ఆనంద కుమారి,  పంచాయతీరాజ్ చంటిబాబు, డి ఈ ఓ ఎన్ వి రవి సాగర్,  పౌరసరఫరాలు డి ఎం ఆర్. తనూజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కె వి ఎస్ ఎం ప్రసాద్ నాగేశ్వర నాయక్ ,ఆర్ డి ఓ వసంతరాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image