రాష్ట్రము లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు : మంత్రి ఆర్.కె. రోజా



ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో తిరుపతి జిల్లాను అభివృద్ధి పథం లో నడిపించాలి 

తిరుపతి జిల్లాలో జగనన్న లేఔట్లు ను సకాలంలో పూర్తి చేసి పేదలకు అందించాలి : జిల్లా ఇంచార్జి మంత్రి


రాష్ట్రము లో ప్రైవేటు పాఠశాలలకు  దీటుగా  ప్రభుత్వ  పాఠశాలు : మంత్రి ఆర్.కె. రోజా 



తిరుపతి, మే 24 (ప్రజా అమరావతి): నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా, జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం నందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్.కె.రోజా, జిల్లా కలెక్టర్  కె. వెంకటరమణారెడ్డి, చిత్తూరు, నెల్లూరు జడ్పీ చైర్మన్ లు గోవిందప్ప శ్రీనివాసులు, ఏ.అరుముగం, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం. గురుమూర్తి, ఎమ్మెల్సీ లు వి.బాలసుబ్రమణ్యం, వి.నారాయణ రెడ్డి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సూళ్ళూరు పేట, వెంకటగిరి శాసన సభ్యులు బి.కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసుదన్ రెడ్డి.కె ఆదిమూలం, వరప్రసాద్, సంజీవయ్య, ఆనం రామ్ నారాయణ రెడ్డి లతో కలసి జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో భాగంగా పేదలందరికి ఇండ్లు  నిర్మాణాలను వేగవంతంగా చేయాలని, ప్రభుత్వం గృహ నిర్మాణా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కులాలకు మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ గృహాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు.  గృహ నిర్మాణాలకు  బ్యాంకుల ద్వారా అవసరమైన వారికి రుణాలు ఇప్పించాలని, జగనన్న లే అవుట్ లో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లా లోని సప్లయ్స చానల్స్ కు పూర్తిగా సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు అభివృద్ధి చేయాలన్నారు. అధికారులు పేద ప్రజలకు సేవ చేసి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది కి మంచి పేరు తీసుకురావలన్నారు.

 ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్కే.రోజా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని  విధంగా  మన రాష్ట్ర౦లో గృహాలకు అర్హులైన సుమారు 30 లక్షల మందికి ఇండ్లు కట్టించడమనేది న భూతో  న భవిష్యత్తని, పేదలందరికీ ఇళ్ళు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటి స్థలాన్ని  గుర్తించడము వాటిని చదును చేసి నిజమైన లబ్ది దారులకు అందివ్వడం అనే గొప్ప కార్యక్రమం పూర్తి అయ్యిందని తెలుపుతూ తదుపరి వాటి నిర్మాణం కార్యక్రమం ఒక యజ్ఞం లా చేపట్టాలన్నారు. హౌసింగ్ అధికారులు కొన్ని మండలాలలో ఇళ్ళు నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉండి మరి కొన్ని చోట్ల ఆలస్యం అవుతుంటే వాటిని సమిక్షించుకొని వేగవంతం చేయాలన్నారు. జగనన్న లే అవుట్ లలో  గృహాల నిర్మాణాలకు సంబంధించి సమస్యలు ఉంటే ఎమెల్యే లు మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన ఎడల సమస్యలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా సమస్యలను పరిష్కరించాడానికి చర్యలు తీసుకుంటామని, పిల్లలకు మంచి విద్యను అందించాలన్న మఖ్య ఉద్దేశ౦తో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల  ధీటుగా నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల కు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో  ఏప్రిల్ 4 న కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా తిరుపతి  జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన తిరుపతి  జిల్లాను అన్ని రకాలుగా జిల్లా ను ప్రగతి పథంలో నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, యంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు సూచనలు సలహాలు  తీసుకొని  జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి  చేస్తామని తెలిపారు. 

 ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మంజూరు అయిన సుమారు 65 వేల గృహాల నిర్మాణాల పురోగతి చాలా తక్కువగా ఉందని, అధికారులు ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టి గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది, యం.పిడివోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సర్పంచులు, యం పి టి సిలు,జడ్పీటిసి సభ్యులు,అందరు కలిసి కట్టుగా ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ది దారులు సకాలంలో గృహాలు నిర్మించుకునేందుకు అవగాహన  కల్పించి అందరూ గృహాలు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  

ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం. గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేకమైన ర్యాంపుల నిర్మాణం చేపడితే బాగుంటుందని సూచించగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని కమిటీ తెలిపింది.    

తిరుపతి శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ పరిధిలో గృహాలకు అర్హులైన లబ్దిదారులు తొందరగా గృహాలు నిర్మించుకునేందుకు సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీకాళహస్తి శాసన సభ్యులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కోవిడ్ బాధితులకు భోజనం, వసతికి సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని మంజూరు చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలు ఆనందం గా ఉన్నారని తెలిపారు. 

వెంకటగిరి నియోజకవర్గం శాసన సభ్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గృహాలు అవసరమైన లబ్దిదారులు నిర్మించుకుంటున్నారని, మరి కొందరు మూడో అప్సన్ ద్వారా ప్రభుత్వం ఇళ్ళు కటింస్తుందని అపోహల్లో ఉన్నారని అలాంటి వారికి గృహాలు నిర్మించుకునే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవలన్నారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లే అవుట్ కి ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయుటలో భాగంగా వారానికి మూడు సార్లు వీటి పై ఆర్డిఓలు గృహ నిర్మాణ శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆప్షన్ 3 కింద లబ్దిదారులకు ఇళ్ళ నిర్మాణాలకు సరిపడ కాంట్రాక్టర్ లను, మేస్త్రిలను గుర్తించి లబ్ది దారులతో కాంట్రాక్టర్ ల కు మధ్య ఎం ఓ యూ లు చేయించి ఐ సి ఐ సి ఐ  బ్యాంకు నందు ఖాతాను ఓపెన్ చేసి స్టేజి వారిగా నిర్మాణం పూర్తి అయిన వెంటనే కాంట్రాక్టర్ల కు చెల్లింపులు జరిగేల చర్యలు చేపట్టాలని తెలిపారు.  

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వి. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఏర్పాటు అవుతుందని నేను అనుకోలేదని, ఇప్పుడు తిరుపతి జిల్లా ఏర్పడి జిల్లా సమస్యలు చర్చించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం లో చిత్తూరు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు  అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. నాయుడు పేట - తిరుపతి ఆరు లైన్ రోడ్లు సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని  సూచించారు. 

సత్యవేడు నియోజకవర్గ శాసన సభ్యులు ఆదిమూలం మాట్లాడుతూ ఈ స్టేజి పై ఉన్న వారు అందరం పూరిగుడిసిలో చదువుకున్నవారమేనని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధ్యానత ఇస్తున్నారని, ముఖ్యంగా ఎస్ సి, ఎస్టీ గ్రామాలలో ఉన్న పాఠశాలలు నాడు –నేడు పథకం ద్వారా ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం లో వసతి గృహాలను మూసి వేయడం జరిగిందని, కాని ఈ ప్రభుత్వంలో గతంలో ఉన్న వాటికంటే మెరుగుగా ఆధునీకరణ చేసిందని తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, వాటి పనులు వెంటనే  చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లా సమీక్ష కమిటి సమావేశంలో గృహ నిర్మాణం, నాడు –నేడు,  వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి హామీ, జగన్నన  భూ హక్కు మరియు  భూ రక్ష రీ సర్వే, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇరిగేషన్, డి ఆర్ డి ఎ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. శాఖలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు అడిగిన వివరాలకు సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జే సి, డి.కె బాలాజీ, ఎస్పి  పరమేశ్వర్ రెడ్డి, డి ఆర్ ఓ శ్రీనివాస రావు, సి పి ఓ  అశోక్ కుమార్, ఆర్ డబ్య్లు ఎస్ ఎస్.ఇ  విజయ కుమార్, డ్వామా ఎ పి డి శ్రీనివాసులు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి, డిఆర్డి ఏ     ఎ. పి డి సి. ప్రభావతి, ఆర్డిఓ లు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరు పేట, గూడూరు, కనకనరసా రెడ్డి  రెడ్డి, హరిత, రోస్ మాండ్, మురళి కృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు. 

 


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image