మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం*...



*మహిళా సాధికారతే ప్రభుత్వ  ధ్యేయం*...



**అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను**


*సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో డ్వాక్రా మహిళల్లో ఆనందోత్సవాలు*...


**రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష**


కడప, మే 5 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించి, మహిళా సాధికారతే ప్రభుత్వ  ధ్యేయంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి నిత్యం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాష పేర్కొన్నారు.


గురువారం తెలుగు గంగా కాలనీ లోని   అంగడి వీధిలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆద్వర్యంలో సున్నా వడ్డీ పథకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్,  కడప ఎంపీ అవినాష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,నగర మేయర్ సురేష్ బాబు,నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,,ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి,జెడ్పిటీసి నరేన్ రామంజనేయరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.


వై.యస్.ఆర్ జిల్లా సున్నా వడ్డీ పథకంలో భాగంగా 2021- 22 ఆర్థిక సంవత్సరానికి  కమలాపురం నియోజకవర్గ పరిధిలోని 474 స్వయం సహాయక సంఘాల మహిళలకు  రూ1.0893 కోట్ల చెక్కును అందజేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్. బి అంజాద్ బాష మాట్లాడుతూ....భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా...ఏ ముఖ్యమంత్రులు సాధించలేని మహిళా సాధికారత ను కేవలం మూడేళ్లలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాధించే దిశగా అడుగులు వేస్తూ అనేక అభివృద్ధి పథకాలను వారి పేరిట రూపొందించడం జరిగిందన్నారు. కుల,మత,పార్టీలకతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న భారతదేశంలో ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు.గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి రైతులను,డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాటతప్పడం జరిగిందన్నారు. అయితే పాదయాత్ర లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  2 పేజీల మ్యానిఫెస్టో ప్రకటించి దాన్ని పవిత్ర గ్రంథంగా భావించి మూడేళ్లలో 95% సంక్షేమ పథకాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారన్నారు. కరోనా కష్టకాలంలో మన రాష్ట్రానికి ఆదాయం తగ్గి పోయినప్పటికీ ఎక్కడా కూడా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. పేద ప్రజలకు అమలుచేస్తున్న  సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ  ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలందరూ  తిప్పికొట్టాలన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలకు  ఉచిత ఇళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములే కాక ప్రైవేటు భూములు కొనుగోలు చేసి మహిళల పేరిట  ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మనదని అన్నారు.


స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు  నేరుగా వారి ఖాతాలో జమచేయడం సంతోషానిచ్చిందన్నారు.స్వయం సహాయక సంఘాల అక్కాచెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర లో చూసి చలించిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ,వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా వంటి పథకాలను రూపొందించారన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారత మెరుగుపడి పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండానే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు.అన్ని సంక్షేమ పథకాలకు  ఎలాంటి మధ్య దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక  ప్రభుత్వమన్నారు.వీటి ద్వారా స్వయం సహాయక సంఘాలు చిన్నతరహా వ్యాపారాలు చేసుకొని  వడ్డీ భారం లేకుండా లాభదాయకంగా మెరుగైన జీవనం సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ  మహిళలకు అండగా ఉంటుందన్నారు.


జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ....

గత ప్రభుత్వాలు మహిళా అభివృద్ధి పట్ల మాట నిలబెట్టుకోలేక పోయాయన్నారు. ఎన్నో సంవత్సరాలుగా  సాధించలేని మహిళా సాధికారతను మూడు సంవత్సరాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు. సమాజంలో, కుటుంబంలో మహిళలకు గౌరవప్రదమైన  ప్రాధాన్యత కల్పించడం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి పేరు మీద చేపట్టడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం  డ్వాక్రా సంఘాలను  నిర్వీర్యం చేశాయన్నారు.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళల అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు.



జిల్లా కలెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ....

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మహిళల ఖాతాల్లో జమచేసిన డబ్బును చిన్నతరహా వ్యాపారాలు చేసుకొని  స్వయం ఉపాధి సాధించే విధంగా ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలలో మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రాధాన్యతనిస్తోందని  ఈ సందర్భంగా తెలిపారు.


కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... 

మహిళా సంఘాలు  ఘనంగా నిర్వహించుకుంటున్న సున్నా వడ్డీ పథకం లో ప్రజా ప్రతినిధులందరు పాలు పంచుకోవడం  ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు మహిళా దినోత్సవం  జరుపుకుంటే

మన రాష్ట్రంలో మాత్రం 365 రోజులు మహిళా దినోత్సవాల రూపంలో సంక్షేమ పథకాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్నారు.    మహిళలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి  కాళ్ళమీద నిలబడి  స్వయం ఉపాధి పొంది అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటునందిస్తుందని తెలిపారు.


 నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ... 

గత ప్రభుత్వ హయాంలో ఉచిత హామీలు ఇచ్చి అక్కాచెల్లెళ్లకు రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన మాట కోసం కరోనాను కష్ట కాలంలో కూడా ఎన్ని ఇబ్బందులు వున్నా  అక్కాచెల్లెళ్ల గురించి ఆలోచించి ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా వైఎస్సార్ చేయూత,సున్నా వడ్డీ పథకం,అమ్మఒడి వంటి  పథకాలను తీసుకుని వచ్చి ప్రతి  అక్క చెల్లెమ్మల ఖాతాలో కోట్ల రూపాయలు జమ చేస్తున్నారన్నారు.సుదీర్ఘ పాదయాత్రలో అందరినీ కలిసి ప్రజల కష్టాలు తెలుసుకొని వారందరి కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 


 కమలాపురం ఎమ్యెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 

పండుగ వాతావరణంలో సున్నా వడ్డీ పథకాన్ని జరుపుకోవడం  సంతోషంగా ఉందన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా కాకుండా  మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా, అన్నగా, తమ్మునిగా,కొడుకుగా మనవడి గా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మూడేళ్ళ పాలనలో  మన ప్రభుత్వం చేపడుతున్న  సంక్షేమ పథకాలు,అభివృద్ధి, సుపరిపాలన మిగతా రాష్ట్రాలన్నింటికి ఆదర్శం అన్నారు.

 

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి మహిళల కు పంచి పెట్టారు.


ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రామ్మోహన్ రెడ్డి,ఏపీ.ఎం.ఐ.పి పిడి మధుసూదన్ రెడ్డి,కో ఆప్షన్ మెంబర్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ గోపి,జిల్లా  వ్యవసాయ మండలి  చైర్మన్ సంబటూరి ప్రసాద్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పులి సునీల్, నగర కార్పొరేటర్లు, వైఎస్సార్సీపి నాయకులు ,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image