నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి

 


*నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి*



*మిష‌న్ నిర్మాణ్ -2022 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

*ప్ర‌తి ఒక్కరూ చ‌రిత్ర మెచ్చే విజేత‌లుగా నిల‌వాల‌ని ఆకాంక్ష‌

*తొలి రోజు ఆంగ్ల భాష ఆవ‌శ్య‌క‌త‌ను, అవ‌కాశాలను వివ‌రించిన నిపుణులు


విజ‌య‌న‌గ‌రం, మే 19 (ప్రజా అమరావతి) ః మిష‌న్ నిర్మాణ్ - 2022 పేరిట స్థానిక‌ ఆనంద గజపతి ఆడిటోరియంలో ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌బోయే శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం గురువారం అట్ట‌హాసంగా జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. శిక్ష‌ణ పొందేందుకు హాజ‌రైన విద్యార్థుల‌ను ఉద్దేశించి ఆమె ప్రారంభోపాన్యాసం చేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విశ్వాస‌మే ఆయుధంగా నైపుణ్యాల‌కు ప‌దును పెట్ట‌డం ద్వారా చ‌రిత్ర మెచ్చే విజేత‌లుగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. స‌మ‌గ్ర శిక్షా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, ఏస్‌, 21 స్ట్ సెంచ‌రీ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన శిక్ష‌ణా కార్య‌క్ర‌మం మొద‌టి రోజు గురువారం విజ‌య‌వంతంగా ప్రారంభ‌మ‌య్యింది.


ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేరుకునేందుకు ఇలాంటి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని, విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. భావిత‌రంలో మీరంతా మంచి స్థానాల్లో స్థిర‌ప‌డడానికి ఇదొక చ‌క్క‌ని వేదికవ‌వుతుంద‌ని, తొలి అడుగులు ఇక్క‌డ నుంచే ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. నేటి పోటీ ప్ర‌పంచంలో నిల‌దొక్కుకోవాలంటే ఆంగ్ల భాష త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ఆంగ్ల భాష‌పై ప‌ట్టు సాధించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. భ‌యం పోవాల‌ని విశ్వాసం పెర‌గాల‌ని హిత‌వు ప‌లికారు. బిడియం వీడి ధైర్యంగా ఇంగ్లీషు మాట్లాడాల‌ని సూచించారు. ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంపై శ్ర‌ద్ధ పెట్టి ప్ర‌తీ అంశాన్నీ క్షుణ్నంగా నేర్చుకోవాల‌ని చెప్పారు. సందేహాల‌ను నివృత్తి చేసుకొని, నిపుణుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు పొందాల‌ని సూచించారు. ప‌రీక్ష‌లు ముగిసిన‌ నేప‌థ్యంలో విద్యార్థుల సౌక‌ర్యార్థం, సెల‌వుల‌ను స‌ద్వినియోగం చేసుకొనేలా ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌ని అంద‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.


అనంత‌రం కేంబ్రిడ్జ్ క‌న్స‌ల్టెంట్ భ‌ర‌త్ సుబ్ర‌మ‌ణ్య అయ్య‌ర్‌, కేంబ్రిడ్జ్ ప్ర‌జెంట‌ర్ షీతల్ బందేక‌ర్‌, సివిల్ స‌ర్వీసెస్ సీనియ‌ర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ ప్రంపంచంలో మిగ‌తా వారితో పోటీ ప‌డి గెలవాలంటే ఇంగ్లీషు భాష‌లో నైపుణ్యం అవస‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇంగ్లీషు భాష‌లో ప్రావీణ్యం ఉంటే త్వ‌రిత‌గ‌తిన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు.


కార్య‌క్ర‌మంలో స‌మ‌గ్ర శిక్షా అభియాన్‌ అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ వి. అప్ప‌ల స్వామినాయుడు, డీఈవో ఎం. జ‌య‌శ్రీ, డైట్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, వివిధ క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, వివిధ పాఠ‌శాల‌ల హెచ్‌.ఎం.లు, అధిక సంఖ్య‌లో విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


*మొద‌టి రోజు ఆంగ్ల భాష ప్రాముఖ్య‌త‌పై త‌ర్ఫీదు*


మొద‌టి రోజు శిక్ష‌ణ‌లో భాగంగా ఆంగ్ల భాష ప్రాముఖ్య‌త‌పై, భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌పై వివ‌రించారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంట్ ద్వారా ప‌లు అంశాల‌పై విశ‌దీక‌రించారు. కేంబ్రిడ్జ్ క‌న్స‌ల్టెంట్ భ‌ర‌త్ సుబ్ర‌మ‌ణ్య అయ్య‌ర్‌, కేంబ్రిడ్జ్ ప్ర‌జెంట‌ర్ షీతల్ బందేక‌ర్‌, సివిల్ స‌ర్వీసెస్ సీనియ‌ర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ ఆంగ్ల భాషపై విద్యార్థుల‌కు త‌ర్ఫీదు ఇచ్చారు. ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలి.. నేర్చుకుంటే భ‌విష్య‌త్తులో ల‌భించే అవకాశాల గురించి సంపూర్ణంగా వివ‌రించారు. విద్యార్థుల‌తో ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అవ‌టం ద్వారా తొలి రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image