ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పక్కదోవపట్టిస్తున్న ప్రభుత్వం : నారా చంద్రబాబు నాయుడు



*కాకినాడలో టిడిపి నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవడాన్ని ఖండించిన చంద్రబాబు*


*ఆసుప్రత్రి వద్ద టిడిపి నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం*


*ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పక్కదోవపట్టిస్తున్న ప్రభుత్వం : నారా చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు కారు డ్రైవర్ మృతి ఘటనలో నిజానిజాలు తేలాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. హత్య అని కుటుంబ సభ్యుల చెపుతుండగా... పోలీసులు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సుబ్రహ్మణ్యం మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని..వాటిని తేల్చేందుకే టిడిపి నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ క్రమంలో కాకినాడ పర్యటనలో టిడిపి నిజనిర్థారణ కమిటీ పై పోలీసులు అనుసరించి వైఖరిని చంద్రబాబు ఖండించారు. అసుపత్రి వద్ద నేతలను నిలువరించే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పు పట్టారు. పోలీసుల దాడిలో అస్వస్థతకు గురైన పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆసుపత్రి పాలయ్యారు. రాజు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య విషయంలో నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతుందని... ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేసే వరకు టిడిపి పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు అన్నారు.

Comments