పారిశ్రామికవేత్తలకు వరంగా 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి



*పారిశ్రామికవేత్తలకు వరంగా 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*


*జీవో నంబర్ 7 అమలుతో 358 పరిశ్రమలకు నవోదయం : ఛైర్మన్*


*రాష్ట్రవ్యాప్తంగా  ఏపీఐఐసీకి 571 దరఖాస్తులు రాక : ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*


అమరావతి, జూన్, 30 (ప్రజా అమరావతి): 'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం'  ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వరంగా మారిందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 7 అమలు ఆ పరిశ్రమలకు నవోదయమైందని ఆయన పేర్కొన్నారు. భూముల పునరుద్ధరణ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకోసం గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుపై బడుగు, బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చిందని ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఏపీఐఐసీ నిర్దేశించుకున్న 7 కేటగిరిల్లో 4 కేటగిరీలకు సంబంధించిన భూముల పునరుద్దరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్లాట్ల కేటాయింపు  ప్రక్రియ మొత్తం ఏపీఐఐసీకి చెందిన  కమిటీ  పారదర్శకంగా నిర్వహించింది.  లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటి  పాత ధరలనే వర్తింపజేయడం, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించడం, అన్ని భూ కేటాయింపులను లీజు నుంచి అమ్మకం(ఓఆర్ఎస్-ఔట్ రేజ్ సేల్) పద్ధతిలోకి మార్చడం, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడం, యూనిట్ ని పూర్తి చేసేందుకు ఏప్రిల్ 1 , 2022 నుంచి మరో మూడేళ్ళ వరకూ కాలపరిమితిని పెంచడం, తద్వారా కట్టాల్సిన మొత్తం, అందుకు వడ్డీ, దానిపై జరిమానాలు లేకుండా చూడడం వంటి వెసులుబాటుతో ఇపుడు 358 పరిశ్రమలు కొత్త ఉత్సాహంతో తిరిగి ప్రారంభం కానున్నాయన్నారు. మరికొన్ని పరిశ్రమలను పరిశీలించి నిర్ణయించాల్సి ఉందన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 జోనల్ ల నుంచి పరిశ్రమల పునరుద్ధరణకోసం దాదాపు 571 దరఖాస్తులు వచ్చాయని ఏపీఐఐసీ వీసీ,ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పష్టం చేశారు. ఒక్క విజయవాడ జోన్ నుంచే 125 దరఖాస్తులు వచ్చాయి. విశాఖ, అనకాపల్లి జోన్ లు కలిపి ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి.  ప్రకాశం జిల్లా నుంచి 65, కాకినాడ నుంచి 54, చిత్తూరు నుంచి 52 దరఖాస్తులు వచ్చాయి.  మొత్తం వచ్చిన 571 దరఖాస్తులను పరిశీలించి ఏపీఐఐసీ వాటిని 7 కేటగిరీలుగా విభజించి ప్లాట్లను తిరిగి కేటాయించే దిశగా  చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 358 యూనిట్లకు ప్లాట్లను రద్దయిన చోటే , అదే ఎస్టేట్ లోనే, అంతే విస్తీర్ణంలో వారికి ప్లాటు కేటాయించే ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.  రద్దయిన యూనిట్లు అక్కడే పునర్ ప్రారంభించేందుకు అనుగుణంగా 163 పరిశ్రమలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిందన్నారు. రద్దయిన యూనిట్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అదే ఎస్టేట్ లేదా మరో చోట 219 యూనిట్లను పునరుద్ధరించేందుకు ఏపీఐఐసీ  కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఏర్పాటైన చోట కాకుండా వేరే ఎస్టేట్ లో కోరుకున్న చోట, కోరుకున్నంత విస్తీర్ణం మేరకు  వీటిని కేటాయించనున్నారు.   అయితే మొత్తం దరఖాస్తులలో ఇంకా యూనిట్ రద్దు కాకుండా పాక్షికంగా చెల్లింపులు జరపకుండా 85 యూనిట్లు, రద్దు కాకుండా కొంచెం కొంచెం చెల్లింపులు జరుపుతూ వన్ టైమ్ సెటిల్ మెంట్ కోరుకునే యూనిట్ల జాబితా కలిపి 182 ఉన్నట్లు ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పష్టం చేశారు. 


*'వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం' నేపథ్యమిది*


 గతంలో ఏదైనా పరిశ్రమకు పదేళ్లపాటు భూమిని లీజుకు ఇచ్చేవారు. దానివల్ల పారిశ్రామికవేత్తలకు రుణమంజూరు సమస్యలు తలెత్తేవి. చిన్న పరిశ్రమలకు కలిగే ఈ ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం  ఏప్రిల్ 2008 నుంచి మార్చి 2020 వరకూ పరిశ్రమల ఏర్పాటుకై ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు పొంది వివిధ కారణాలు వల్ల పరిశ్రమలు నెలకొల్పలేనివారికి ఈ అవకాశాన్ని కల్పించింది. లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటిధరలను వర్తింపజేయడమేకాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే ఈ వెసులుబాటుకు గత మార్చి 31లోపు నమోదు చేసుకునే వీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు ప్లాట్లు పొందిన నాటిధరలను వర్తింపజేయడమేకాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం పభ్రుత్వం కల్పిస్తున్నట్లు ఏపీఐఐసీ స్పష్టం చేసింది.  దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడమేకాకుండా, 3 నెలలలోపు వడ్డీలేకుండా నగదు చెల్లించేలా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్ మెంట్) అవకాశం ఇచ్చింది.  ఏపీఐఐసీమార్గదర్శకాలను అనుసరిస్తూ పరిశమ్రలను ఏర్పా టు చేసుకునేవారికే భూ కేటాయింపుల సేల్ డీడీ సాధ్యమని గత ఫిబ్రవరి 5న ఇచ్చిన జీవో నంబర్ 7 మార్గదర్శకాలలో పేర్కొంది. 



Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image